కొరియన్ కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఎక్కువ శాతం ఫ్రీ మేక్స్ అయితే ఓ బేబీ లాంటి అరా కొరా సినిమాలు రీమేకులుగా తీసుకొచ్చారు. తాజాగా ఓ కొరియన్ రీమేక్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమానే శాకిని డాకిని. నివేత థామస్ , రెజీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాను వర్షన్ మార్చి తెలుగులో తీశారు.
ఒరిజినల్ సినిమా మిడ్ నైట్ రన్నర్ లో ఇద్దరు హీరోలుంటారు. వారి ఇద్దరి మీదే కథ నడుస్తుంది. అయితే తెలుగుకి వచ్చేసరికి నిర్మాత సునీత దాన్ని ఇద్దరు హీరోయిన్స్ కథగా మార్చారు. ఇద్దరు హీరోలు అంటే కొంత సమస్య అనుకున్నారో లేదా లేడీ నిర్మాతగా దీన్ని ఫీమేల్స్ కథ ఎందుకు చేయకూడదు అనుకున్నారో మొత్తం మీద మార్చారు. కథలో హీరోయిన్స్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ రీమేక్ ను టాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో పెట్టారు. సినిమా షూట్ ఎండ్ కొచ్చేసరికి రిజల్ట్ అర్థమైందో ఏమో కానీ దర్శకుడు మెల్లగా సైడ్ అయిపోయాడు. తర్వాత ఆనంద్ రంగ అనే దర్శకుడితో సినిమాను పూర్తి చేయించారు.
ఇక సినిమాను బాగా నమ్మేసి రిలీజ్ కి ముందు రెజీనా , నివేథా గట్టిగా పొగిడేశారు. రెజీనా అయితే ఎదో గొప్ప సినిమా అన్నట్టుగా చెప్పుకుంది. మ్యాగీ అంటూ మగాళ్లను కామెడీ చేస్తూ అడల్ట్ జోకులు వేసి మరీ ప్రమోషన్స్ చేసి సినిమాను హైప్ చేసే ప్రయత్నం చేసింది. తీరా చూస్తే సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీన్ని ఫీమేల్ వర్షన్ గా మార్చకుండా మేల్ వర్షన్ నే ఉన్నది ఉన్నట్టు తీసినా బాగుండేదని కొందరు విశ్లేషకుల భావన. అలాగే ఎవరైనా యంగ్ హీరోలు ను పెట్టి చేసి ఉంటే కాస్త కలెక్షన్స్ వచ్చేవి.
This post was last modified on September 17, 2022 10:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…