సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో తన అభిమానుల్ని విషాదంలోకి నెట్టి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగిస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకున్న అతను.. చివరగా తాను నటించిన సినిమా దిల్ బేచరా విడుదల కూడా కాకుండానే వెళ్లిపోయాడు. లాక్డౌన్ లేకుంటే ఆ సినిమా ఎప్పుడో విడుదలయ్యేది. అది రిలీజై మంచి విజయం సాధిస్తే.. ఆ ఉత్సాహంలో సుశాంత్ ఆత్మహత్య ఆలోచనలే చేసేవాడు కాదేమో. ఏదేమైనప్పటికీ.. సుశాంత్ మరణించిన నెలన్నరకే అతడి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
అభిమానులు అతడి చివరి సినిమాను థియేటర్లలో చూసి అతడికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటున్నారు కానీ.. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు నిర్మాతలు. ఈ నెల 24నే దిల్ బేచరా డిస్నీ+హాట్ స్టార్లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని హాట్ స్టార్లో అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ లేకున్నా ఉచితంగా సినిమా చూడొచ్చు. మామూలుగా పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చినా ప్రీమియం కేటగిరీలో పెడుతుంటారు. అలాంటిది సుశాంత్ చివరి సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతున్నా.. దానికి మంచి క్రేజ్ ఉన్నా.. ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తున్నారు. సుశాంత్కు ట్రిబ్యూట్గా ఈ అవకాశం కల్పిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఈ సినిమాను చూడబోతున్నారన్నమాట.
This post was last modified on July 6, 2020 7:53 pm
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…