సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో తన అభిమానుల్ని విషాదంలోకి నెట్టి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగిస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకున్న అతను.. చివరగా తాను నటించిన సినిమా దిల్ బేచరా విడుదల కూడా కాకుండానే వెళ్లిపోయాడు. లాక్డౌన్ లేకుంటే ఆ సినిమా ఎప్పుడో విడుదలయ్యేది. అది రిలీజై మంచి విజయం సాధిస్తే.. ఆ ఉత్సాహంలో సుశాంత్ ఆత్మహత్య ఆలోచనలే చేసేవాడు కాదేమో. ఏదేమైనప్పటికీ.. సుశాంత్ మరణించిన నెలన్నరకే అతడి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
అభిమానులు అతడి చివరి సినిమాను థియేటర్లలో చూసి అతడికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటున్నారు కానీ.. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు నిర్మాతలు. ఈ నెల 24నే దిల్ బేచరా డిస్నీ+హాట్ స్టార్లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని హాట్ స్టార్లో అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ లేకున్నా ఉచితంగా సినిమా చూడొచ్చు. మామూలుగా పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చినా ప్రీమియం కేటగిరీలో పెడుతుంటారు. అలాంటిది సుశాంత్ చివరి సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతున్నా.. దానికి మంచి క్రేజ్ ఉన్నా.. ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తున్నారు. సుశాంత్కు ట్రిబ్యూట్గా ఈ అవకాశం కల్పిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఈ సినిమాను చూడబోతున్నారన్నమాట.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…