సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో తన అభిమానుల్ని విషాదంలోకి నెట్టి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగిస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకున్న అతను.. చివరగా తాను నటించిన సినిమా దిల్ బేచరా విడుదల కూడా కాకుండానే వెళ్లిపోయాడు. లాక్డౌన్ లేకుంటే ఆ సినిమా ఎప్పుడో విడుదలయ్యేది. అది రిలీజై మంచి విజయం సాధిస్తే.. ఆ ఉత్సాహంలో సుశాంత్ ఆత్మహత్య ఆలోచనలే చేసేవాడు కాదేమో. ఏదేమైనప్పటికీ.. సుశాంత్ మరణించిన నెలన్నరకే అతడి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
అభిమానులు అతడి చివరి సినిమాను థియేటర్లలో చూసి అతడికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటున్నారు కానీ.. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు నిర్మాతలు. ఈ నెల 24నే దిల్ బేచరా డిస్నీ+హాట్ స్టార్లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని హాట్ స్టార్లో అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ లేకున్నా ఉచితంగా సినిమా చూడొచ్చు. మామూలుగా పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చినా ప్రీమియం కేటగిరీలో పెడుతుంటారు. అలాంటిది సుశాంత్ చివరి సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతున్నా.. దానికి మంచి క్రేజ్ ఉన్నా.. ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తున్నారు. సుశాంత్కు ట్రిబ్యూట్గా ఈ అవకాశం కల్పిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఈ సినిమాను చూడబోతున్నారన్నమాట.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…