సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో తన అభిమానుల్ని విషాదంలోకి నెట్టి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగిస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకున్న అతను.. చివరగా తాను నటించిన సినిమా దిల్ బేచరా విడుదల కూడా కాకుండానే వెళ్లిపోయాడు. లాక్డౌన్ లేకుంటే ఆ సినిమా ఎప్పుడో విడుదలయ్యేది. అది రిలీజై మంచి విజయం సాధిస్తే.. ఆ ఉత్సాహంలో సుశాంత్ ఆత్మహత్య ఆలోచనలే చేసేవాడు కాదేమో. ఏదేమైనప్పటికీ.. సుశాంత్ మరణించిన నెలన్నరకే అతడి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
అభిమానులు అతడి చివరి సినిమాను థియేటర్లలో చూసి అతడికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటున్నారు కానీ.. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు నిర్మాతలు. ఈ నెల 24నే దిల్ బేచరా డిస్నీ+హాట్ స్టార్లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని హాట్ స్టార్లో అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. సబ్స్క్రిప్షన్ లేకున్నా ఉచితంగా సినిమా చూడొచ్చు. మామూలుగా పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చినా ప్రీమియం కేటగిరీలో పెడుతుంటారు. అలాంటిది సుశాంత్ చివరి సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతున్నా.. దానికి మంచి క్రేజ్ ఉన్నా.. ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తున్నారు. సుశాంత్కు ట్రిబ్యూట్గా ఈ అవకాశం కల్పిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఈ సినిమాను చూడబోతున్నారన్నమాట.
This post was last modified on July 6, 2020 7:53 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…