సినిమా టికెట్ 75.. ఆ రోజు కాదు

ఇటీవ‌లే అమెరికా, బ్రిట‌న్ దేశాల్లో సెప్టెంబ‌రు 3వ తేదీని నేష‌న‌ల్ సినిమా డేగా జ‌రుపుకొన్నారు. ఆ సంద‌ర్భంగా సినిమా టికెట్ ధ‌ర‌ను త‌గ్గించి 3 డాల‌ర్ల‌కు ఫిక్స్ చేశారు. మామూలుగా టికెట్ ధ‌ర మినిమం 8 డాల‌ర్లుంటుంది. డిమాండును బ‌ట్టి ప్రిమియ‌ర్ షోల‌కు 35-40 డాల‌ర్ల రేటు కూడా పెడుతుంటారు. అలాంటిది 3 డాల‌ర్ల‌కు మ‌ల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవ‌కాశం ద‌క్క‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్లకు పోటెత్తారు.

తెలుగు సినిమా అయిన కార్తికేయ‌-2 నాలుగో వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో న‌డిచిందంటే నేష‌న‌ల్ సినిమా డే సంద‌ర్భంగా త‌గ్గించిన రేట్లే కార‌ణం. ఇప్పుడు ఇండియాలో కూడా నేష‌న‌ల్ సినిమా డేను జ‌రుపుకోవ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌రు 16న ఇందుకు ముహూర్తం కుదిరింది. ఈ సంద‌ర్భంగా మ‌ల్టీప్లెక్సుల‌న్నింట్లోనూ రూ.75 రేటును ఫిక్స్ చేశారు.

ఈ మేర‌కు కొన్ని రోజుల ముందే ప్ర‌క‌ట‌న రావ‌డంతో సినీ ప్రియులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే కార‌ణాలేంటో ఏమో కానీ.. సెప్టెంబ‌రు 16న నేష‌న‌ల్ సినిమా డేను జ‌రుపుకోవ‌డం లేదు. దీన్ని వారం వాయిదా వేశారు. సెప్టెంబ‌రు 23కు ఫిక్స్ చేశారు. ఆ రోజే జాతీయ సినీ వేడుక‌లు జ‌రగ‌నున్నాయి. టికెట్ ధ‌ర రూ..75 ఉండ‌బోతోంది ఆ శుక్ర‌వారం రోజు.

ఈ ఏడాది చివ‌ర్లో అవ‌తార్-2 రిలీజ్ కానున్న నేప‌థ్యంలో అవ‌తార్-2ను 23నే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాల‌జీతో రీమాస్ట‌ర్ చేసి రిలీజ్ చేస్తుండ‌డంతో ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అదే రోజు టికెట్ ధ‌ర‌ను రూ.75కు త‌గ్గిస్తుండ‌డంతో అవ‌తార్ థియేట‌ర్లు జ‌నాల‌తో నిండిపోవ‌డం ఖాయం. అదే రోజు రిలీజ‌య్యే వేరే చిత్రాల‌కు కూడా మంచి ఆక్యుపెన్సీనే ఉండొచ్చు.