అమల.. 80, 90 దశకాల్లో సినిమాలు చూసిన సౌత్ ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేని పేరిది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో అప్పటి యువతను కట్టిపడేసింది ఆమె. అయితే కెరీర్ మంచి ఊపులో ఉండగానే అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయారు అమల.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత మరో సినిమా చేయలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమలు చేసిన అమ్మ పాత్రకు మంచి స్పందన వచ్చినప్పటికీ ఆ సినిమా ఆడక పోవడం వల్ల ఏమో ఆమె బ్రేక్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఒకే ఒక జీవితం సినిమాకు అమల పాత్ర, ఆమె నటన మేజర్ హైలెట్ అని చెప్పాలి. అమల చేయడం వల్ల ఆ పాత్రకు ఒక కొత్తదనం వచ్చింది. తనతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ చాలా హృద్యంగా సాగడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సన్నివేశాలతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది ఆ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఎమోషనల్ గా ఈ స్థాయిలో కదిలించిన పాత్రలు అరుదు అని చెప్పాలి.
కథానాయికగా చేసినప్పుడు అమల అందం గురించి అందరూ మాట్లాడుకొన్నారు కానీ నటన గురించి పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరూ ఆమె యాక్టింగ్ గురించి చర్చించుకుంటున్నారు. అమల నుంచి ఇలాంటి పాత్రలు మరిన్ని ఆశిస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత తీసుకున్నట్లు అమల ఈసారి బ్రేక్ తీసుకోదని, అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ తమను అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on September 10, 2022 5:46 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…