సినిమా థియేటర్లు ఆగష్టులో తిరిగి ఓపెన్ అవుతాయనే నమ్మకం లేదింకా. దసరా టైంకు మొదలైతే గొప్ప అనేస్తున్నారంతా. చాలా మంది నిర్మాతలు డిసెంబర్, సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు. పూర్తయిన సినిమాలకు వడ్డీ పెరిగిపోతోంది. అయినా కానీ కొందరు నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయాల్సిందే అని పట్టుబట్టారు.
ఉప్పెన సినిమా హక్కుల కోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేసాయి. ఎన్నాళ్లయినా, ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ తేల్చేసిందట. ఈ చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్క తేలిందట. అంత మొత్తం ఈ రేంజ్ సినిమాకు ఓటిటి ద్వారా వచ్చే అవకాశమే లేదు.
థియేట్రికల్ గా ఈ చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేసారు. కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఒక అయిదారు కోట్ల అదనపు భారం పడిన పర్వాలేదని భావిస్తున్నారు.
This post was last modified on July 6, 2020 10:44 am
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…