సినిమా థియేటర్లు ఆగష్టులో తిరిగి ఓపెన్ అవుతాయనే నమ్మకం లేదింకా. దసరా టైంకు మొదలైతే గొప్ప అనేస్తున్నారంతా. చాలా మంది నిర్మాతలు డిసెంబర్, సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు. పూర్తయిన సినిమాలకు వడ్డీ పెరిగిపోతోంది. అయినా కానీ కొందరు నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయాల్సిందే అని పట్టుబట్టారు.
ఉప్పెన సినిమా హక్కుల కోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేసాయి. ఎన్నాళ్లయినా, ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ తేల్చేసిందట. ఈ చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్క తేలిందట. అంత మొత్తం ఈ రేంజ్ సినిమాకు ఓటిటి ద్వారా వచ్చే అవకాశమే లేదు.
థియేట్రికల్ గా ఈ చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేసారు. కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఒక అయిదారు కోట్ల అదనపు భారం పడిన పర్వాలేదని భావిస్తున్నారు.
This post was last modified on July 6, 2020 10:44 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…