గాడ్ ఫాదర్.. మెగాస్టార్ చిరంజీవికి చాలా ముఖ్యమైన చిత్రమిది. రీఎంట్రీలో చేసిన తొలి చిత్రం ఖైదీ నంబర్ 150 మినహాయిస్తే చిరు చేసిన రెండు సినిమాలు సైరా, ఆచార్య ఆయనకు నిరాశా జనక ఫలితాన్నే అందించాయి. సైరా ఉన్నంతలో బాగానే ఆడినా మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం వల్ల అది కాస్ట్ ఫెయిల్యూర్గా నిలిచింది. ఇక ఆచార్య సంగతి చెప్పాల్సిన పనే లేదు. చిరు కెరీర్లోనే ఇది ఒక పెద్ద మచ్చ అని చెప్పొచ్చు. అది టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ మీద చిరు చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఐతే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ అయితే కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం.. ఇది ఒక రీమేక్ కావడమే. మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన లూసిఫర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. దాని డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం.
ఐతే ఇంకో నాలుగు వారాల్లోపే గాడ్ ఫాదర్ దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా.. చిత్ర బందం ప్రమోషన్లతో హోరెత్తించి సినిమాకు బజ్ పెంచే ప్రయత్నాలేమీ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుక్కారణం టీం తీరిక లేకుండా పని చేస్తుండడమే. దీని షూటింగ్ చివరి దశలో ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్, ఆడియో పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యే రిలీజైన టీజర్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో వాటిపై మళ్లీ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. దీని వల్ల టీం బాగా హడావుడి పడుతోందని.. దసరా డెడ్ లైన్ను అందుకోగలమా లేదా అనే టెన్షన్ నడుస్తోందని.. అందుకే ప్రమోషన్లకు టైం కేటాయించలేకపోతున్నారని సమాచారం.
ఈ సినిమాను దసరా రేసు నుంచి తప్పించి డిసెంబరులో రిలీజ్ చేయాలన్న చర్చ కూడా జరిగింది కానీ.. మంచి సీజన్ను వదులుకోవడమే కాక వాయిదా వేయడం ద్వారా నెగెటివిటీని కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతో దసరా రిలీజ్కే కట్టుబడి ఉన్నారని సమాచారం. కానీ ఆ డెడ్ లైన్ను అందుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.
This post was last modified on September 7, 2022 7:19 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…