Movie News

విజయ్ – హరీష్ కాంబో కుదురుతుందా?

లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ‘ఖుషి’ సినిమాను రెడీ చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. దీని తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే విషయంపై రౌడీ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంటుంది. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఖుషి ఫినిష్ అవ్వగానే విజయ్ మళ్ళీ పూరి తో జనగణమన స్టార్ట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు విజయ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా ? అనే ప్రశ్న మొదలైంది.

లైగర్ సెట్స్ పై ఉండగానే సుకుమార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎనౌన్స్ అయింది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పుష్ప 2 తో సుకుమార్ మళ్ళీ బిజీ అయ్యాడు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టని ఈ సినిమా కోసం సుక్కు ఏడాదిన్నర పైనే తీసుకోనున్నాడు. అంటే ఇప్పట్లో విజయ్ తో సుకుమార్ సినిమా ఉండకపోవచ్చు. ఒకవేళ పుష్ప 2 కూడా భారీ హిట్టయితే సుకుమార్ మీద స్టార్ హీరోలంతా కర్చీఫ్ వేస్తారు.

అందుకే విజయ్ ఇప్పుడు తనకి వచ్చిన గ్యాప్ లో ఓ మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. గీత గోవిందం తర్వాత దిల్ రాజు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. దీంతో తాజాగా విజయ్ దిల్ రాజు ని కలిసి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే దిల్ రాజు పవన్ సినిమా కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం కాళీగా ఉన్న హరీష్ శంకర్ తో విజయ్ కి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు భోగట్టా. అన్ని సెట్ అయితే సుకుమార్ సినిమా కంటే ముందు విజయ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ కాంబో కుదురుతుందా ? లేదా చూడాలి.

This post was last modified on September 7, 2022 3:36 pm

Share

Recent Posts

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

17 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

13 hours ago