Movie News

విజయ్ – హరీష్ కాంబో కుదురుతుందా?

లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ‘ఖుషి’ సినిమాను రెడీ చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. దీని తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే విషయంపై రౌడీ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంటుంది. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఖుషి ఫినిష్ అవ్వగానే విజయ్ మళ్ళీ పూరి తో జనగణమన స్టార్ట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు విజయ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా ? అనే ప్రశ్న మొదలైంది.

లైగర్ సెట్స్ పై ఉండగానే సుకుమార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎనౌన్స్ అయింది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పుష్ప 2 తో సుకుమార్ మళ్ళీ బిజీ అయ్యాడు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టని ఈ సినిమా కోసం సుక్కు ఏడాదిన్నర పైనే తీసుకోనున్నాడు. అంటే ఇప్పట్లో విజయ్ తో సుకుమార్ సినిమా ఉండకపోవచ్చు. ఒకవేళ పుష్ప 2 కూడా భారీ హిట్టయితే సుకుమార్ మీద స్టార్ హీరోలంతా కర్చీఫ్ వేస్తారు.

అందుకే విజయ్ ఇప్పుడు తనకి వచ్చిన గ్యాప్ లో ఓ మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. గీత గోవిందం తర్వాత దిల్ రాజు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. దీంతో తాజాగా విజయ్ దిల్ రాజు ని కలిసి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే దిల్ రాజు పవన్ సినిమా కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం కాళీగా ఉన్న హరీష్ శంకర్ తో విజయ్ కి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు భోగట్టా. అన్ని సెట్ అయితే సుకుమార్ సినిమా కంటే ముందు విజయ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ కాంబో కుదురుతుందా ? లేదా చూడాలి.

This post was last modified on September 7, 2022 3:36 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago