మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై బజ్ ఉంది. కానీ మేకర్స్ ఊహించినంత హైప్ రావడం లేదు. అందుకే నెలాఖరున ఓ గ్రాండ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నారు. చిరు -పవన్ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులవుతుంది. సైరా ఈవెంట్ తర్వాత మళ్ళీ స్టేజి పై ఇద్దరు కనిపించలేదు.
ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ఎలానో వస్తారు. అలాగే స్పెషల్ గెస్ట్ గా పవన్ వస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని మెగా ఈవెంట్ హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే పవన్ ని గెస్ట్ గా పిలవాలని ఫిక్సయినట్టు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ ని హిందీ మార్కెట్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ముంబై లో కూడా హిందీ వర్షన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ బిగ్ బీ అమితాబ్ ని కూడా రంగంలోకి దింపాలని చిరు అనుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక గాడ్ ఫాదర్ ఈవెంట్ ను ఈ నెలాఖరున చేయబోతున్నారు. అప్పుడు పర్మిషన్ కూడా ఈజీగా వస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఈవెంట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి పవన్ అన్నయ్య సినిమాకు తన స్పీచ్ తో ఎలాంటి హైప్ తెస్తాడో చూడాలి. ఒకవేళ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లే పవన్ వస్తే …చిరు పవన్ సల్మాన్ ఫొటోస్ వైరల్ అవుతాయి. మెగా బ్రదర్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతాయి. దీంతో సినిమాకు మంచి ప్రమోషన్ వచ్చినట్టే. ఆలాగే అదే వేదికపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేయాలని టీం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
This post was last modified on September 7, 2022 12:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…