మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై బజ్ ఉంది. కానీ మేకర్స్ ఊహించినంత హైప్ రావడం లేదు. అందుకే నెలాఖరున ఓ గ్రాండ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నారు. చిరు -పవన్ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులవుతుంది. సైరా ఈవెంట్ తర్వాత మళ్ళీ స్టేజి పై ఇద్దరు కనిపించలేదు.
ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ఎలానో వస్తారు. అలాగే స్పెషల్ గెస్ట్ గా పవన్ వస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని మెగా ఈవెంట్ హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే పవన్ ని గెస్ట్ గా పిలవాలని ఫిక్సయినట్టు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ ని హిందీ మార్కెట్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ముంబై లో కూడా హిందీ వర్షన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ బిగ్ బీ అమితాబ్ ని కూడా రంగంలోకి దింపాలని చిరు అనుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక గాడ్ ఫాదర్ ఈవెంట్ ను ఈ నెలాఖరున చేయబోతున్నారు. అప్పుడు పర్మిషన్ కూడా ఈజీగా వస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఈవెంట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి పవన్ అన్నయ్య సినిమాకు తన స్పీచ్ తో ఎలాంటి హైప్ తెస్తాడో చూడాలి. ఒకవేళ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లే పవన్ వస్తే …చిరు పవన్ సల్మాన్ ఫొటోస్ వైరల్ అవుతాయి. మెగా బ్రదర్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతాయి. దీంతో సినిమాకు మంచి ప్రమోషన్ వచ్చినట్టే. ఆలాగే అదే వేదికపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేయాలని టీం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
This post was last modified on September 7, 2022 12:42 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…