Movie News

మీడియాకి సురేష్ బాబు దూరం ?

టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్స్ లో సురేష్ ప్రొడక్షన్ ఒకటి. రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ సురేష్ బాబు ఈ సంస్థను రన్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు అన్ని విషయాల్లో ముందుంటారు. అల్లు అరవింద్ , సురేష్ బాబు , దిల్ రాజు ఈ ముగ్గురే ఏ విషయం గురించైనా అలవోకగా మాట్లాడుతుంటారు. టాలీవుడ్ లో ఏ టాపికయినా సురేష్ బాబు దగ్గర కచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అలాంటి సురేష్ బాబు ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నారు.

ఇటివలే టాలీవుడ్లో ఓ సమస్య వచ్చింది. షూటింగ్స్ ఆపేసి మరీ గిల్డ్ నిర్మాతలందరూ ఏకమయ్యారు. అందులో సురేష్ బాబు కూడా ఉన్నారు. కొన్ని మెయిన్ మీటింగ్స్ కి అటెండయ్యారు కూడా. కానీ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. గిల్డ్ తరుపున దిల్ రాజు , సి కళ్యాణ్ , దామోదర ప్రసాద్ ఇలా కొందరు మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

అయితే సురేష్ బాబు ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ విషయంలోనే కాదు తను నిర్మించిన సినిమా, రిలీజ్ చేస్తున్న సినిమా ప్రెస్ మీట్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. సురేష్ ప్రొడక్షన్ నుండి వస్తున్న శాకిని డాకిని సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించడం లేదు. అంతెందుకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న రానా సినిమా ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో కూడా సురేష్ పాల్గొనలేదు. నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని విషయాల గురించి మాట్లాడిన సురేష్ బాబు ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు ? తెలియాల్సి ఉంది.

This post was last modified on September 7, 2022 12:14 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

1 hour ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

3 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

4 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

4 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

4 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

7 hours ago