టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్స్ లో సురేష్ ప్రొడక్షన్ ఒకటి. రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ సురేష్ బాబు ఈ సంస్థను రన్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు అన్ని విషయాల్లో ముందుంటారు. అల్లు అరవింద్ , సురేష్ బాబు , దిల్ రాజు ఈ ముగ్గురే ఏ విషయం గురించైనా అలవోకగా మాట్లాడుతుంటారు. టాలీవుడ్ లో ఏ టాపికయినా సురేష్ బాబు దగ్గర కచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అలాంటి సురేష్ బాబు ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నారు.
ఇటివలే టాలీవుడ్లో ఓ సమస్య వచ్చింది. షూటింగ్స్ ఆపేసి మరీ గిల్డ్ నిర్మాతలందరూ ఏకమయ్యారు. అందులో సురేష్ బాబు కూడా ఉన్నారు. కొన్ని మెయిన్ మీటింగ్స్ కి అటెండయ్యారు కూడా. కానీ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. గిల్డ్ తరుపున దిల్ రాజు , సి కళ్యాణ్ , దామోదర ప్రసాద్ ఇలా కొందరు మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.
అయితే సురేష్ బాబు ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ విషయంలోనే కాదు తను నిర్మించిన సినిమా, రిలీజ్ చేస్తున్న సినిమా ప్రెస్ మీట్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. సురేష్ ప్రొడక్షన్ నుండి వస్తున్న శాకిని డాకిని సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించడం లేదు. అంతెందుకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న రానా సినిమా ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో కూడా సురేష్ పాల్గొనలేదు. నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని విషయాల గురించి మాట్లాడిన సురేష్ బాబు ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు ? తెలియాల్సి ఉంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…