శర్వానంద్కు కొన్నేళ్ల ముందు హీరోగా ఎంత డిమాండ్ ఉండేదో తెలిసిందే. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా లాంటి వరుస హిట్లతో అతను దూసుకెళ్లాడు. తర్వాత ఒకట్రెండు ఫ్లాపులు పడ్డా ‘మహానుభావుడు’తో పుంజుకున్నాడు. అతడికి అప్పుడు రూ.30 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. పేరున్న బేనర్లలో మంచి బడ్జెట్లలో సినిమాలు చేసేవాడు. కానీ ‘మహానుభావుడు’ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో అతడి మార్కెట్ కరిగిపోతూ వచ్చింది. డిమాండ్ పడిపోయింది.
ఇప్పుడు శర్వాతో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి తలెత్తింది. చివరగా వచ్చిన అతడి సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఏమాత్రం ప్రభావం చూపకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఒకే ఒక జీవితం’ మీద ఉన్నాయి. ఐతే శర్వా వరుస ఫ్లాపుల వల్ల ఈ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ కాలేదు. ఈ శుక్రవారమే ‘ఒకే ఒక జీవితం’ రిలీజవుతుండగా.. ఈలోపు లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్యతో సోమవారం తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు శర్వా.
ఇంకో ఫ్లాపు పడితే ఇండస్ట్రీలో తన ఉనికే ప్రశ్నార్థకం అయ్యే స్థితిలో శర్వా.. కృష్ణచైతన్యతో జట్టు కడుతున్నాడు. ఆ దర్శకుడి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ‘రౌడీ ఫెలో’తో అరంగేట్రంలోనే ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత దర్శకుడిగా అతడి కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. రెండో చిత్రం ‘ఛల్ మోహన రంగ’ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నితిన్తోనే ‘పవర్ పేట’ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. దీంతో చాన్నాళ్ల పాటు కృష్ణచైతన్య ఖాళీగా ఉండిపోయాడు.
చివరికిప్పుడు శర్వా లాంటి ఫ్లాప్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తేడా కొడితే అతడికీ కష్టమవుతుంది. ఇక ఇందులో హీరోయిన్గా నటిస్తున్న రాశి ఖన్నా పరిస్థితి సరే సరి. తాజాగా ఆమె ‘థాంక్యూ’ రూపంలో పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది. దానికి ముందు పక్కా కమర్షియల్, వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఆమెను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇలాంటి ట్రాక్ రికార్డుతో మళ్లీ ఓ అవకాశం అందుకోవడం విశేషమే. కానీ ఈ చిత్రం తేడా కొడితే ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయినట్లే. ఐతే ఇలా డేంజర్ జోన్లో ఉన్న వాళ్లందరినీ నమ్మి ‘కార్తికేయ-2’తో మెగా సక్సెస్ అందుకున్న టీజీ విశ్వ ప్రసాద్ సినిమా నిర్మిస్తుండటం విశేషమే.
This post was last modified on September 5, 2022 8:41 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…