శాటిలైట్ ఛానల్స్ ఒకప్పుడు కొత్త సినిమాలను నమ్ముకుని ఎక్కువగా పోటీ పడేవి. కానీ ఓటిటిలు వచ్చాక ఈ దూకుడు మునుపటిలా లేదు. థియేటర్ కు వచ్చిన నెల రోజులకే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మీద లేటెస్ట్ మూవీస్ అన్నీ వస్తుండటంతో అదే పనిగా యాడ్స్ ని భరిస్తూ టీవీలో ప్రీమియర్లు చూసే ఓపిక ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. ఈ కారణంగానే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు తెచ్చిన ఆర్ఆర్ఆర్ అల వైకుంఠపురములోని దాటలేకపోగా, కెజిఎఫ్ చాఫ్టర్ 2 ఎప్పుడో జమానాలో వచ్చిన రజనీకాంత్ రోబో టిఆర్పిని టచ్ చేయలేకపోయింది.
అందుకే ఇప్పడు ఛానల్స్ ఫోకస్ రియాలిటీ షోల మీద ఎక్కువగా ఉంటోంది. ఎంత ఖర్చు పెట్టయినా సరే ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టార్ మా బిగ్ బాస్ పుణ్యమాని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, వెంకటేష్ తదితరులను యాంకర్లుగా గెస్టులుగా తీసుకొచ్చి బాగా లాభపడింది.
జెమినీ తారక్ తో చేయించిన ఎవరు మీలో కోటీశ్వరులు కోసం రామ్ చరణ్ తో మొదలుపెట్టి తమన్ దాకా ఎందరో సెలబ్రిటీలు హాజరై ఆ ప్రోగ్రాంకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చారు. అందుకే ఈ విషయంలో వెనుకబడ్డామని గుర్తించిన జీ ఛానల్ ఏకంగా మహేష్ బాబునే రంగంలోకి దించింది. సండే స్పెషల్ గా వస్తున్న ఓ డాన్స్ ప్రోగ్రాం ఎపిసోడ్ కు మహేష్ తో పాటు సితార పాపను కూడా అతిథులుగా తీసుకొచ్చారు.
వీటి తాలూకు ప్రోమోలు ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. పార్టిసిపెంట్స్ కు అవకాశం ఇస్తానని ప్రిన్స్ మాటివ్వడం, చిన్నపిల్లల ముద్దు మాటలు, డాన్సర్ల ఎగ్జైట్మెంట్ అంతా ఓ రేంజ్ లో సాగిపోయింది. మహేష్ తో ఏడాది కాలానికి సదరు ఛానల్ అగ్రిమెంట్ చేసుకుందని టీవీ వర్గాల టాక్. ఇందుకు గాను తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది కానీ దీనికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ లేదు. మొత్తానికి మహేష్ ని మాములుగా వాడటం లేదు.
This post was last modified on September 4, 2022 12:10 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…