పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన కారణం చేత ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం , వెంటనే టీం పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిందే.. ఫ్యాన్స్ కి అలాగే మీడియా కి ఎన్టీఆర్ సారీ కూడా చెప్పాడు. భారీ ఎత్తున జరగాల్సిన ఈవెంట్ ని ఇలా చిన్న వేదికపై చేయాల్సి వచ్చిందని డిజప్పాయింట్ అయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది.
రామోజీ ఫిలిం సిటీలో వేదిక ఫిక్స్ చేసుకొని ఈవెంట్ కంపనీ ఎనిమిది రోజుల క్రితమే పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. అది వచ్చే లోపు అంతా రెడీ చేసేసుకున్నారు. భారీ వేదిక, ఫైర్ వర్క్స్, బారీ కేడ్లు, ఎక్కువ సంఖ్యలో బౌన్సర్స్ ఇలా అంతా రెడీ చేసేశారు. అంతే కాదు రన్బీర్ కపూర్ చేతితో ఫైర్ క్రియేట్ అయ్యేలా సినిమా కాన్సెప్ట్ ని చెప్పేలా ఏదో భారీ గా ప్లాన్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ని హైప్ చేసేందుకు నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ మాట్లాడే ముందు ఏదో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మురిసిపోయేలా కూడా ప్లాన్ చేశారట.
నిన్న అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఈవెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని ఓ బెస్ట్ మెమొరీ అయ్యేదని అంటున్నారు. ఏమైనా గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాకపోవడంతో అంతా వృధా అయింది. కొన్ని రోజులుగా నిద్ర తిండి పట్టించుకోకుండా కష్టపడిన అందరి కష్టం బూడిద పాలైంది. ఏదేమైనా ముంబై నుండి ఈవెంట్ కోసం విచ్చేసిన బ్రహ్మాస్త్ర టీం ని అలాగే ఎన్టీఆర్ ను పార్క్ హయత్ కి అప్పటి కప్పుడు షిఫ్ట్ చేసి ఈవెంట్ మెనేజ్మెంట్ తో కలిసి రాజమౌళి అండ్ టీం బాగానే సెట్ చేశారు. కానీ అనుకున్న విధంగా భారీ ఎత్తున ఆర్భాటంగా ఈవెంట్ చేయలేకపోయామనే బాధ మాత్రం రాజమౌళి, ఎన్టీఆర్, నాగార్జున మొహంలో కనిపించింది.
This post was last modified on September 3, 2022 10:18 pm
దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత…
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం…
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం…
తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి…
దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…