పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన కారణం చేత ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం , వెంటనే టీం పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిందే.. ఫ్యాన్స్ కి అలాగే మీడియా కి ఎన్టీఆర్ సారీ కూడా చెప్పాడు. భారీ ఎత్తున జరగాల్సిన ఈవెంట్ ని ఇలా చిన్న వేదికపై చేయాల్సి వచ్చిందని డిజప్పాయింట్ అయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది.
రామోజీ ఫిలిం సిటీలో వేదిక ఫిక్స్ చేసుకొని ఈవెంట్ కంపనీ ఎనిమిది రోజుల క్రితమే పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. అది వచ్చే లోపు అంతా రెడీ చేసేసుకున్నారు. భారీ వేదిక, ఫైర్ వర్క్స్, బారీ కేడ్లు, ఎక్కువ సంఖ్యలో బౌన్సర్స్ ఇలా అంతా రెడీ చేసేశారు. అంతే కాదు రన్బీర్ కపూర్ చేతితో ఫైర్ క్రియేట్ అయ్యేలా సినిమా కాన్సెప్ట్ ని చెప్పేలా ఏదో భారీ గా ప్లాన్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ని హైప్ చేసేందుకు నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ మాట్లాడే ముందు ఏదో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మురిసిపోయేలా కూడా ప్లాన్ చేశారట.
నిన్న అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఈవెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని ఓ బెస్ట్ మెమొరీ అయ్యేదని అంటున్నారు. ఏమైనా గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాకపోవడంతో అంతా వృధా అయింది. కొన్ని రోజులుగా నిద్ర తిండి పట్టించుకోకుండా కష్టపడిన అందరి కష్టం బూడిద పాలైంది. ఏదేమైనా ముంబై నుండి ఈవెంట్ కోసం విచ్చేసిన బ్రహ్మాస్త్ర టీం ని అలాగే ఎన్టీఆర్ ను పార్క్ హయత్ కి అప్పటి కప్పుడు షిఫ్ట్ చేసి ఈవెంట్ మెనేజ్మెంట్ తో కలిసి రాజమౌళి అండ్ టీం బాగానే సెట్ చేశారు. కానీ అనుకున్న విధంగా భారీ ఎత్తున ఆర్భాటంగా ఈవెంట్ చేయలేకపోయామనే బాధ మాత్రం రాజమౌళి, ఎన్టీఆర్, నాగార్జున మొహంలో కనిపించింది.
This post was last modified on September 3, 2022 10:18 pm
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…