కొంత కాలంగా సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కదా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితికి మించి రేట్లు పెంచేయడం చేటు చేసింది. అసలే కొవిడ్ తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు ఈ రేట్లు చూసి బెంబేలెత్తిపోయి మరింతగా వెండి తెరలకు దూరమయ్యారు.
తెలుగులో పెద్ద సినిమాలకు మల్టీప్లెక్సుల్లో రేటు రూ.300-400 మధ్య పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పెద్ద సినిమాలకు ఈ రేట్లు బాగా చేటు చేశాయి. ‘సర్కారు వారి పాట’ సరిగా ఆడకపోవడానికి, ‘ఆచార్య’ రెండో రోజు నుంచే అడ్రస్ లేకుండా పోవడానికి.. ‘వారియర్’ లాంటి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ రాకపోవడానికి టికెట్ల రేట్లు పరోక్ష కారణం అనడంలో సందేహం లేదు. రోజు రోజుకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
గత నెలలో వచ్చిన సినిమాలన్నింటికీ చాలా వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు ఉండేలా చూశారు. ‘లైగర్’కు రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం, పైగా డిజాస్టర్ టాక్ రావడం దెబ్బ కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రూ.325 రేటు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ చిత్రానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్లో ప్రధాన మల్టీప్లెక్సులు టికెట్ల అమ్మకాలు ఆరంభించాయి. వాటన్నింట్లో కూడా సినిమాకు రూ.325 రేటు ఫిక్స్ చేసి పెట్టేశారు.
దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.360 దాకా అవుతోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడం, పైగా త్రీడీలో రిలీజ్ చేస్తుండడంతో ఈ రేటు నిర్ణయించినట్లున్నారు. నిర్మాతల వైపు నుంచి చూస్తే ఇది కరెక్ట్ రేటు అనిపింవచ్చు. కానీ ప్రేక్షకుల యాంగిల్లో చూస్తే మాత్రం ఈ రేటు చాలా ఎక్కువే. హిందీతో పాటు తెలుగు వెర్షన్కు కూడా ఇదే రేట్ ఫిక్స్ చేయడంతో మన ప్రేక్షకులు ఇంతింత రేటు పెట్టి ఒక అనువాద చిత్రాన్ని చూస్తారా అన్నది సందేహం. ఐతే సినిమాకు డీసెంట్ బజ్ ఉండడంతో బుకింగ్స్ అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకు మంచి టాక్ రాకపోతే మాత్రం ఈ రేట్లు చాలా చేటు చేసే ప్రమాదం ఉంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…