యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తారక్ ఫ్యాన్స్ ని బాగా కలవరపరిచింది. బింబిసార తర్వాత తను పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తున్న వేడుక ఇదే కావడంతో భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తీరా చూస్తే సెక్యూరిటీని కారణంగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దానికి సంబంధించిన వివరణ పాయింట్ల వారిగా ఇస్తూ తామెందుకు పర్మిషన్ ని తిరస్కరించామో వివరించారు. ఆ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అందులో పోలీస్ శాఖ ప్రధానంగా గతంలో జరిగిన రెండు ఈవెంట్ల గురించి ప్రస్తావించింది. 2021లో రాధే శ్యామ్ వేడుక ఇదే వేదిక వద్ద జరిగినప్పుడు లెక్కకు మించి పాసులు ఇచ్చారని, ఇది రాచకొండ కమీషనర్ ఆదేశాలను మీరడమేనని పేర్కొంది. అంతే కాదు సదరు కేసు తాలూకు నెంబర్లు కూడా పొందుపరిచింది. మరో ఉదాహరణ చెబుతూ సాహో ఈవెంట్ సైతం ఇక్కడే జరిగితే తండోప తండాలుగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేక డిపార్టుమెంటు పడ్డ ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఆర్గనైజర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపింది.
బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు నోటి మాటగా 10 నుంచి 12 వేల దాకా జనం వస్తారని పేర్కొన్నారని, కానీ వాటి తాలూకు పాసులు జారీ చేసే పద్దతేది తమకు స్పష్టం చేయలేదని చురకలు వేసింది. రాధే శ్యామ్ సమయంలో ఫిలిం సిటీ ఉన్న నేషనల్ హైవే 65 మీద భారీ ఎత్తున వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ జరిగిందని మరోసారి రిపీటయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పింది. గణేష్ విగ్రహాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉన్న వైనాన్ని కూడా అందులోనే చెప్పింది. మొత్తానికి కారణాలు ఎన్ని ఉన్నా బ్రహ్మాస్త్ర ఈవెంట్ క్యాన్సిలేషన్ కి ప్రభాస్ సినిమాలు పరోక్షంగా కారణం కావడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on September 3, 2022 10:01 am
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…