Movie News

ప్రభాస్ ఈవెంట్లే బ్రేక్ వేశాయి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తారక్ ఫ్యాన్స్ ని బాగా కలవరపరిచింది. బింబిసార తర్వాత తను పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తున్న వేడుక ఇదే కావడంతో భారీగా అక్కడికి చేరుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తీరా చూస్తే సెక్యూరిటీని కారణంగా చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించారు. దానికి సంబంధించిన వివరణ పాయింట్ల వారిగా ఇస్తూ తామెందుకు పర్మిషన్ ని తిరస్కరించామో వివరించారు. ఆ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అందులో పోలీస్ శాఖ ప్రధానంగా గతంలో జరిగిన రెండు ఈవెంట్ల గురించి ప్రస్తావించింది. 2021లో రాధే శ్యామ్ వేడుక ఇదే వేదిక వద్ద జరిగినప్పుడు లెక్కకు మించి పాసులు ఇచ్చారని, ఇది రాచకొండ కమీషనర్ ఆదేశాలను మీరడమేనని పేర్కొంది. అంతే కాదు సదరు కేసు తాలూకు నెంబర్లు కూడా పొందుపరిచింది. మరో ఉదాహరణ చెబుతూ సాహో ఈవెంట్ సైతం ఇక్కడే జరిగితే తండోప తండాలుగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేక డిపార్టుమెంటు పడ్డ ఇబ్బందులను చెప్పుకొచ్చింది. ఆర్గనైజర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపింది.

బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు నోటి మాటగా 10 నుంచి 12 వేల దాకా జనం వస్తారని పేర్కొన్నారని, కానీ వాటి తాలూకు పాసులు జారీ చేసే పద్దతేది తమకు స్పష్టం చేయలేదని చురకలు వేసింది. రాధే శ్యామ్ సమయంలో ఫిలిం సిటీ ఉన్న నేషనల్ హైవే 65 మీద భారీ ఎత్తున వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ జరిగిందని మరోసారి రిపీటయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయని చెప్పింది. గణేష్ విగ్రహాల బందోబస్తులో సిబ్బంది బిజీగా ఉన్న వైనాన్ని కూడా అందులోనే చెప్పింది. మొత్తానికి కారణాలు ఎన్ని ఉన్నా బ్రహ్మాస్త్ర ఈవెంట్  క్యాన్సిలేషన్ కి ప్రభాస్ సినిమాలు పరోక్షంగా కారణం కావడం ఫైనల్ ట్విస్ట్.

This post was last modified on September 3, 2022 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

54 minutes ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

2 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

2 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

5 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

6 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

9 hours ago