ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ విడుదల కాబోతోంది. ఇటీవలే వదిలిన బర్త్ డే టీజర్ లో రిలీజ్ డేట్ అక్టోబర్ 5 కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకెలాంటి మార్పు ఉండకపోవచ్చు. కాకపోతే చేతిలో ఇంత తక్కువ టైం ఉన్నా ఇప్పటిదాకా ఒక్క లిరికల్ వీడియో వదల్లేదు. అదే రోజు రిలీజవుతున్న నాగార్జున ది ఘోస్ట్ ఆల్రెడీ ట్రైలర్ కట్ తో జనాన్ని ఇంప్రెస్ చేసింది. ఏదో విషయం ఉందన్న అభిప్రాయాన్ని బలంగా కలిగించింది. అది స్ట్రెయిట్ సబ్జెక్టు. అలాంటిది రీమేక్ అయిన గాడ్ ఫాదర్ ఇంకా అలెర్ట్ గా ఉండాలి.
అసలే ఆచార్య ఇచ్చిన మెగా షాక్ చిరుకే కాదు ఫ్యాన్స్ ని ఇప్పటికీ కోలుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఆ గాయాలన్నీ గాడ్ ఫాదర్ మాన్పుతుందననే నమ్మకంతో వాళ్లున్నారు. ఇందులో చిరుకి హీరోయిన్ లేదు.. జోడి కట్టి డాన్స్ చేసేందుకు ఛాన్స్ ఎక్కడ. సో సల్మాన్ ఖాన్ తో క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ కోసం దర్శకుడు మోహన్ రాజా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తమన్ ట్యూన్ కి నృత్య దర్శకుడు ప్రభుదేవా కంపోజ్ ఈ ఒక్క పాటతో థియేటర్లు ఈగలు కేకలతో ఓ రేంజ్ లో దద్దరిల్లిపోతాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ గాడ్ ఫాదర్ ప్రమోషన్లతో మొదలుపెట్టి రిలీజ్ దాకా చేసుకోవాల్సిన ప్లానింగ్ చాలా ఉంది. ఏ మాత్రం నిర్లిప్తంగా ఉన్నా ఫలితాలు అటుఇటు అవుతాయి. ఆచార్య ఎంత డిజాస్టర్ అయినప్పటికీ తెల్లవారుఝామున కనీసం బెనిఫిట్ షోలు మొదలు కాకుండానే విపరీతమైన ప్రీ నెగటివ్ టాక్ బయటికి వచ్చేసి మొదటి రోజు కలెక్షన్లను చాలా డ్యామేజ్ చేసింది. చేస్తున్నదే ఆల్రెడీ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో సహా అందుబాటులో ఉన్న లూసిఫర్ రీమేక్. అలాంటిది ఆ తలంపే రాకుండా ఉండాలంటే రియల్ మెగాస్టార్ స్వాగ్ ని బయటికి తీయాలి. మరి మోహన్ రాజా ఏం చేయబోతున్నాడో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on September 2, 2022 2:26 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…