‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతడి క్రేజ్ దేశ విదేశాలకు విస్తరించింది. తన మార్కెట్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇకపై అతను చేసే సినిమాల స్కేల్ పెద్దగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే తన కొత్త చిత్రాల విషయంలో చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ శంకర్ లాంటి మెగా డైరెక్టర్తో ఓ సినిమా చేస్తున్న చరణ్.. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో అనుకున్న సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
గౌతమ్ కథ క్లాస్ టచ్ ఉన్నది కావడం, మారిన తన ఇమేజ్కు అది సెట్ కాదని అనిపించడంతోనే చరణ్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. దీని స్థానంలో అతను వేరే సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చరణ్.. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్తో మెగా పవర్ స్టార్ జట్టు కట్టే అవకాశాలున్నట్లు సమాచారం.
చరణ్-లోకేష్ కలయికలో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ప్రయత్నిస్తోందట. ఈ మేరకు జోరుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యువి అధినేతలతో చరణ్కు గొప్ప అనుబంధం ఉంది. ఆ బేనర్లో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నప్పటికీ కుదరట్లేదు. ఇక లోకేష్తోనూ చరణ్కు మంచి స్నేహమే ఉంది. చరణ్ తనకు ఎంత క్లోజో స్వయంగా లోకేషే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్తో సినిమా చేసే అవకాశాలున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు.
‘విక్రమ్’ సినిమా తర్వాత అతడి డిమాండ్ ఎంత పెరిగిపోయిందో తెలిసిందే. అతను ప్రస్తుతానికి విజయ్తో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఖైదీ-2, విక్రమ్-2 సినిమాలు చేయాల్సి ఉంది. కానీ అవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో క్లారిటీ లేదు. ఈ లోపు చరణ్ సినిమా మధ్యలోకి వస్తే ఆశ్చర్యమేమీ లేదు. శంకర్ సినిమాను చరణ్, విజయ్ సినిమాను లోకేష్ పూర్తి చేసి వచ్చే ఏడాది మధ్యలో తమ కలయికలో సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూడాలి మరి.
This post was last modified on September 1, 2022 10:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…