ఎంసిఏ… మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా పెద్ద హిట్ అయినా తదుపరి అవకాశం కోసం వేణు శ్రీరామ్ చాలా కలం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే రెండేళ్ల పాటు ఐకాన్ కథ రాయడం కోసమే కేటాయించానని అతను చెబుతున్నాడు. అల్లు అర్జున్ కి ఈ కథ చెప్పి సింగిల్ సిటింగ్లో ప్రకటన ఇప్పించాడు. ఇప్పటికీ ఐకాన్ సినిమా బన్నీ చేస్తాడనే నమ్మకంతోనే వేణు ఉన్నాడు. ఈలోగా అనుకోకుండా వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని పవన్ కి మరపురాని సినిమాగా నిలిచిపోయేలా చేయాలని వేణు తపిస్తున్నాడు.
పింక్ రీమేక్ చాలా మంది చూసేసి ఉంటారు కనుక ఈ చిత్రాన్ని వేణు ఎలా మలుస్తాడనేది ఆసక్తి కలిగిస్తోంది. అందులోను పవన్ లాంటి కమర్షియల్ హీరోతో ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా అంటే కాస్త ఇబ్బందే. మరి దానిని వేణు ఎలా అధిగమిస్తాడో చూడాలి.
ఐకాన్ కథ తన కోసం ఉంచమని, వేరే హీరోకు వినిపించవద్దని బన్నీ చెప్పాడట. కానీ ఎప్పుడు చేస్తాడనేది చెప్పలేదు. అల వైకుంఠపురములో తర్వాత పుష్ప కూడా అంత హిట్టయితే బన్నీ తన మాటకు కట్టుబడి ఉంటాడా లేదా అనేది డౌటే.
కానీ ఒక స్టార్ హీరో కథ లాక్ చేసి పెట్టమన్నాక అతడి మాట కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలదు. వకీల్ సాబ్ రిజల్ట్ అటు, ఇటు అయితే అది ఐకాన్ కి చుట్టుకుంటుందో లేదో కూడా తెలీదు.
This post was last modified on July 5, 2020 8:21 pm
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…