ఎంసిఏ… మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా పెద్ద హిట్ అయినా తదుపరి అవకాశం కోసం వేణు శ్రీరామ్ చాలా కలం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే రెండేళ్ల పాటు ఐకాన్ కథ రాయడం కోసమే కేటాయించానని అతను చెబుతున్నాడు. అల్లు అర్జున్ కి ఈ కథ చెప్పి సింగిల్ సిటింగ్లో ప్రకటన ఇప్పించాడు. ఇప్పటికీ ఐకాన్ సినిమా బన్నీ చేస్తాడనే నమ్మకంతోనే వేణు ఉన్నాడు. ఈలోగా అనుకోకుండా వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని పవన్ కి మరపురాని సినిమాగా నిలిచిపోయేలా చేయాలని వేణు తపిస్తున్నాడు.
పింక్ రీమేక్ చాలా మంది చూసేసి ఉంటారు కనుక ఈ చిత్రాన్ని వేణు ఎలా మలుస్తాడనేది ఆసక్తి కలిగిస్తోంది. అందులోను పవన్ లాంటి కమర్షియల్ హీరోతో ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా అంటే కాస్త ఇబ్బందే. మరి దానిని వేణు ఎలా అధిగమిస్తాడో చూడాలి.
ఐకాన్ కథ తన కోసం ఉంచమని, వేరే హీరోకు వినిపించవద్దని బన్నీ చెప్పాడట. కానీ ఎప్పుడు చేస్తాడనేది చెప్పలేదు. అల వైకుంఠపురములో తర్వాత పుష్ప కూడా అంత హిట్టయితే బన్నీ తన మాటకు కట్టుబడి ఉంటాడా లేదా అనేది డౌటే.
కానీ ఒక స్టార్ హీరో కథ లాక్ చేసి పెట్టమన్నాక అతడి మాట కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలదు. వకీల్ సాబ్ రిజల్ట్ అటు, ఇటు అయితే అది ఐకాన్ కి చుట్టుకుంటుందో లేదో కూడా తెలీదు.
This post was last modified on July 5, 2020 8:21 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…