మహానటితో మహా ఇమేజ్ సాధించుకున్న కీర్తి సురేష్ కు ఆ తర్వాత కెరీర్ సక్సెస్ రేట్ పరంగా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈ ఏడాది గుడ్ లుక్ సఖి డిజాస్టర్ కాగా మహేష్ బాబుతో మొదటిసారి జోడి కట్టిన సర్కారు వారి పాట సైతం మరీ బ్లాక్ బస్టర్ అయితే కాలేకపోయింది. ప్రైమ్ ఓటిటి కోసం చేసిన చిన్ని(సాని కడియం) పెర్ఫార్మన్స్ పరంగా పేరు తీసుకొచ్చిందే తప్ప దానికొచ్చిన ఫీడ్ బ్యాక్ సైతం సోసోనే.
నేను లోకల్ తర్వాత నానితో చేస్తున్న దసరా, చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న భోళా శంకర్ మాత్రమే తన చేతిలో ఉన్నాయి. ఇక విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కీర్తి మరోసారి జంటగా నటించబోతున్నట్టు చెన్నై అప్డేట్. మాస్టర్ – విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ డ్రామాకు తన పేరే పరిశీలనలో ఉందట. కాకపోతే భార్యగా తక్కువ లెన్త్ తో ఫ్లాష్ బ్యాక్ లో ఉండొచ్చని అంటున్నారు.
గతంలో విజయ్ తో చేసిన సినిమాలు ఒకటి భైరవ రెండోది సర్కారు కమర్షియల్ గా సక్సెస్ అయినవే. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం కాంబో అవుతున్నారు. విక్రమ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ మీదున్న లోకేష్ ఈసారి మాస్టర్ ని మించిన హై ఎండ్ ఎంటర్ టైనర్ ఇవ్వాలని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఇందులోనే మరో ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులోనే సమంతా కూడా ఉంటుందట.
అయితే తనది కొంచెం నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో డిఫరెంట్ గా చూపిస్తారని వినికిడి. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా దాదాపు అంగీకారానికి వచ్చినట్టేనని చెబుతున్నారు. యశోద, శాకుంతలంలు పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న సమంతా ఛాలెంజింగ్ గా అనిపించే పాత్రలకు మాత్రమే ఎస్ చెబుతోంది. మరి లోకేష్ కనగరాజ్ అంతటి వాడు అడిగితే కాదనే ఛాన్స్ ఉంటుందా. ఏమో చూద్దాం. సామ్ కీర్తి కలిసి నటించిన వాటిలో సీమరాజా, మహానటి లాంటి హిట్లున్నాయి.
This post was last modified on August 31, 2022 10:32 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…