సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పట్నుంచో ఫేస్బుక్లో ఉంటున్నాడు కానీ.. అంత యాక్టివ్ ఏమీ కాదు. ఈ మధ్య తన తండ్రి చిరంజీవి ట్విట్టర్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో.. కొన్ని రోజులకే చరణ్ కూడా ఆ మాధ్యమంలోకి వచ్చాడు. కానీ చిరులా వరుసబెట్టి ట్వీట్లు ఏమీ వేసేయట్లేదు.
ఏదో నామమాత్రంగా ట్విట్టర్లో ఉన్నానంటే ఉన్నాను అనిపిస్తున్నాడు. రెగ్యులర్గా అప్ డేట్లు ఏమీ ఇచ్చే అలవాటు లేదు చరణ్కు. అలాంటిది ఆదివారం ఒక ఆసక్తికర ట్వీట్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు మెగా పవర్ స్టార్.
When u seek revenge violent or non-violent, we are just revolving ,not evolving.
హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.
-Edith Eva Eger: The Choice
ఇదీ రామ్ చరణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన మెసేజ్. దీనితో పాటు వినయ విధేయ రామలో ఒంటిపై పచ్చబొట్లతో ఫెరోషియస్ లుక్తో కనిపించే ఫొటో ఒకటి.. మరో క్లోజప్ ఫొటో కూడా షేర్ చేశాడు చరణ్. మార్గం ఏదైనా సరే.. ప్రతీకారం తీర్చుకోవడం మీద దృష్టిపెడితే మనం ఎదగలేం అని చరణ్ చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ వార్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. అలాంటివి వద్దని తన అభిమానులకు చరణ్ చెబుతున్నట్లే ఉంది ఈ ట్వీట్ చూస్తే. కాకపోతే అతను షేర్ చేసిన ఫొటో తాలూకు సినిమా ప్రతీకారం నేపథ్యంలోనే నడుస్తుందన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 5, 2020 6:47 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…