సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పట్నుంచో ఫేస్బుక్లో ఉంటున్నాడు కానీ.. అంత యాక్టివ్ ఏమీ కాదు. ఈ మధ్య తన తండ్రి చిరంజీవి ట్విట్టర్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో.. కొన్ని రోజులకే చరణ్ కూడా ఆ మాధ్యమంలోకి వచ్చాడు. కానీ చిరులా వరుసబెట్టి ట్వీట్లు ఏమీ వేసేయట్లేదు.
ఏదో నామమాత్రంగా ట్విట్టర్లో ఉన్నానంటే ఉన్నాను అనిపిస్తున్నాడు. రెగ్యులర్గా అప్ డేట్లు ఏమీ ఇచ్చే అలవాటు లేదు చరణ్కు. అలాంటిది ఆదివారం ఒక ఆసక్తికర ట్వీట్తో అందరి దృష్టినీ ఆకర్షించాడు మెగా పవర్ స్టార్.
When u seek revenge violent or non-violent, we are just revolving ,not evolving.
హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.
-Edith Eva Eger: The Choice
ఇదీ రామ్ చరణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన మెసేజ్. దీనితో పాటు వినయ విధేయ రామలో ఒంటిపై పచ్చబొట్లతో ఫెరోషియస్ లుక్తో కనిపించే ఫొటో ఒకటి.. మరో క్లోజప్ ఫొటో కూడా షేర్ చేశాడు చరణ్. మార్గం ఏదైనా సరే.. ప్రతీకారం తీర్చుకోవడం మీద దృష్టిపెడితే మనం ఎదగలేం అని చరణ్ చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ వార్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. అలాంటివి వద్దని తన అభిమానులకు చరణ్ చెబుతున్నట్లే ఉంది ఈ ట్వీట్ చూస్తే. కాకపోతే అతను షేర్ చేసిన ఫొటో తాలూకు సినిమా ప్రతీకారం నేపథ్యంలోనే నడుస్తుందన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 5, 2020 6:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…