Movie News

దూకుడు పెంచిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అనుకున్న‌ది సాధించేలా.. దూకుడు పెంచారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో ఢీ అంటే ఢీ అంటూ.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న భార‌తీయ రాష్ట్ర‌స‌మితి పేరుతో ఒక జాతీయ పార్టీని ప్రారంభించి.. వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌రంలో దేశ‌వ్యాప్తంగా పోటీ చేయాల‌నినిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు కొన్నాళ్ల కింద‌ట లీకులు ఇచ్చాయి. అయితే.. వీటిని ప్ర‌తిప‌క్షాలు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

కేసీఆర్‌ను కేవ‌లం ఫామ్ హౌస్ సీఎంగా అభివ‌ర్ణించ‌డంలోనే.. పార్టీలు కాల‌క్షేపం చేస్తున్నాయి. అయితే.. చాప‌కింద నీరులా.. కేసీఆర్ త‌న వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కు దీటుగా రాజ‌కీయ విన్యాసంపై ఆయ‌న దృష్టి పెట్టారు. దీనికి ఆయ‌న తాజాగా.. మూడు రాష్ట్రాల‌ను ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రిలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్‌.. కొద్ది నెల‌ల గ్యాప్‌తో ఎన్నిక‌లు జ‌ర‌గనున్న క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌పై కేసీఆర్ న‌జ‌ర్ ప‌డింద‌ని అంటున్నారు.

అయితే.. ఈ ద‌ఫా.. ప్ర‌ధాని మోడీకి చెక్ పెట్టేలా.. ఆయ‌న గుజ‌రాత్ మోడ‌ల్‌ను ఎంచుకుంటే.. సీఎం కేసీఆర్ తెలంగాణ మోడ‌ల్‌ను ఎంచుకున్నార‌ని అంటున్నారు.  ఈ మోడ‌ల్ ఏంటంటే.. రైతుల‌కు సానుకూల నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. వారితోపాటు.. ద‌ళితులకు అండ‌గా ఉండ‌డం.. స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయడం. ఇదే మంత్రాన్ని ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్ర‌యోగించేందుకు కేసీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ప్రస్తుతానికి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ  ప్రాంతీయ పార్టీ అయినందున.. గుజరాత్, హిమాచల్, క‌ర్ణాటకలో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలోకి దింపి.. బీజేపీ ఓట్ల‌ను చీల్చ‌డం.. లేదా.. అవకాశం ఉంటే గెలుపు గుర్రం ఎక్క‌డం.. అనే రాజ‌కీయ వ్యూహానికి కేసీఆర్‌ప‌దును పెట్టిన‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల నాయ‌కుల‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అంతేకాదు.. వివిధ ప్రాజెక్టులు.. ప‌థ‌కాల‌పై వారికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చారు.

అనంత‌రం.. వారికి రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కూడా వివ‌రించారు. ఈ క్ర‌మంలో బీజేపీ పాలిత ఈ మూడు రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను కూడా వారి నుంచే అడిగి తెలుసుకున్నారు.  తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా.. ఈ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ మోడ‌ల్ పాలిటిక్స్ తీసుకురావాల‌నేది కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  

తాజాగా వెలువ‌డుతున్న రాజ‌కీయ స‌మాచారం మేర‌కు.. క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో.. రైతు నాయ‌కుల‌ను ఎన్నిక‌ల్లో పోటీ పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడకు వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కొత్త చర్చ లేవనెత్తాలని వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్, మోటార్లకు మీటర్లను వ్యతిరేకించడం, సాగునీటి సౌకర్యం, గ్రామాల్లో కల్లాల నిర్మాణం, రైతు వేదికలు తదితరాల గురించే కాకుండా.. ద‌ళిత బంధు ప్ర‌తిష్టాత్మక ప‌థ‌కాన్నికూడా ఆయా రాష్ట్రాల వ‌ర‌కు విస్త‌రించాల‌ని గులాబీ బాస్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  ఇది ఖ‌చ్చితంగా బీజేపీకి.. మైన‌స్ అవుతుంద‌ని.. కేంద్రంలో పాగా వేసేందుకు.. ఇది స‌రైన  స‌మ‌య‌మ‌ని.. ఆయ‌న లెక్క‌లు వేసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 31, 2022 5:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

14 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

51 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago