సౌత్ ఇండియన్ సినిమాలో క్వాలిటీ పరంగా అత్యున్నత స్థాయిలో నిలిచే ఇండస్ట్రీ మాలీవుడ్. అక్కడ దశాబ్దాల నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. అక్కడ గొప్ప గొప్ప టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఉన్నారు. కాకపోతే వాళ్ల మార్కెట్ చిన్నది. పైగా దక్షిణాదిన మిగతా భాషలతో పోలిస్తే మలయాళం అంత సరళంగా ఉండదు. అందువల్ల మలయాళ సినిమా చాలా కాలం పాటు కేరళ దాటి ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది.
కానీ గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల జోరు పుణ్యమా అని మలయాళ సినిమా రీచ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆ భాషా చిత్రాలను అందరూ బాగా చూస్తున్నారు. అక్కడి దర్శకులు, నటుల సత్తా అందరికీ తెలుస్తోంది. ఈ క్రమంలోనే మలయాళ ఆర్టిస్టులు వేరే భాషల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ మధ్య మలయాళ నటుల ప్రాబల్యం పెరుగుతోంది. జయరాం, ఉన్ని ముకుందన్, గోవింద్ పద్మసూర్య, ఫాహద్ ఫాజిల్.. ఇలా చాలామంది నటులు తెలుగులో అడుగు పెట్టారు.
ఇప్పుడు మరో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ టాలీవుడ్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఆ నటుడి పేరు. రోషన్ మాథ్యూ. గత కొన్నేళ్లలో మలయాళంలో ఈ యువ నటుడికి చాలా మంచి పేరొచ్చింది. తెలుగులోకి రీమేక్ అవుతున్న కప్పెలాలో అతడి పాత్ర భలేగా హైలైట్ అయింది. దీంతో పాటు సీయూ సూన్ లాంటి చిత్రాల్లోనూ అతను ఆకట్టుకున్నాడు.
ఈ యువ నటుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న కొత్త సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నాడట. ఇప్పటికే అల వైకుంఠపురములో మలయాళీలైన జయరాం, గోవింద్లను నటింపజేసిన మాటల మాంత్రికుడు.. ఇప్పుడు ఓ ఫ్రెష్ ఫేస్ కోసం వెతికి రోషన్ను ఎంచుకున్నట్లు సమాచారం. ఏరికోరి అతణ్ని ఎంచుకున్నాడంటే అది స్పెషల్ రోలే అయి ఉండొచ్చు. సెప్టెంబరులోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 31, 2022 12:35 pm
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేశాడో తెలిసిందే. ముఖ్యంగా ‘లగాన్’ దగ్గర్నుంచి…
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…