ఈ మధ్య అదే పనిగా బాలీవుడ్ సినిమాలను టార్గెట్ చేస్తూ బాయ్కాట్కు పిలుపునిస్తున్న వ్యక్తుల గురించి తన కొత్త చిత్రం లైగర్ ప్రమోషన్ల సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. బాయ్కాట్ చేస్తే చేయనివ్వండి.. ఏమవుతుంది.. చూసేవాళ్లు ఎలా అయినా చూస్తారు అన్నట్లు మాట్లాడాడు అతను. చాలామంది విజయ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అభిప్రాయపడగా.. అనవసరంగా బాయ్కాట్ బ్యాచ్ను కెలికి సినిమాకు చెడు చేసుకున్నాడనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలోనే ముంబయికి చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ మనోజ్ దేశాయ్.. విజయ్ మీద మండిపడ్డాడు. విజయ్ యాటిట్యూడ్, యారొగెన్స్ వల్ల లైగర్ సినిమాకు బుకింగ్స్ లేవని, ఇంత అతి పనికి రాదని, విజయ్ కావాలనుకుంటే తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలని ఆయన విమర్శించాడు.
కట్ చేస్తే రెండు రోజుల తర్వాత విజయ్ నేరుగా వెళ్లి మనోజ్ దేశాయ్ను కలిశాడు. వాస్తవంగా అసలేం జరిగింది వివరించాడు. తన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం చెప్పాడు. అలాగే తన వ్యాఖ్యలు బాధ పెట్టి ఉంటే క్షమించాలని అడగడమే కాక మనోజ్ కాళ్ల మీద పడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.
ఈ సందర్భంగా మనోజ్ దేశాయ్.. తిరిగి విజయ్కి సారీ చెప్పడం విశేషం. విజయ్ వ్యాఖ్యలకు సంబంధించి చిన్న బిట్ను మాత్రమే ఎవరో తనకు ఫార్వర్డ్ చేశారని.. అది చూసి అతణ్ని తప్పుగా అర్థం చేసుకున్నానని.. నిజానికి అతడి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. విజయ్ స్వయంగా వచ్చి తనకు వివరించడంతో తనెలాంటి వాడో అర్థమైందని అన్నాడు మనోజ్. లైగర్ సినిమా హిందీలో మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు కూడా ఆయన తెలిపాడు. విజయ్ మంచి స్థాయికి వెళ్లాలని అభిలషిస్తూ అతడిని మనోజ్ ఆశీర్వదించి పంపడంతో కథ సుఖాంతం అయింది.
This post was last modified on August 29, 2022 11:01 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…