ఈ మధ్య పాన్ ఇండియా బిల్డప్ తో వచ్చిన సినిమాల్లో అధిక శాతం డిజాస్టర్లు కావడం బాలీవుడ్ ని విపరీతంగా కలవరపెడుతోంది. కంటెంట్ దారుణంగా ఉండటం ఒక కారణమైతే మొదటి వారం రావాల్సిన కనీస వసూళ్లను బాయ్ కాట్ బ్యాచులు మింగేయడం ఎగ్జిబిటర్లను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. మొన్నామధ్య ఓ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఈ అంశం గురించి విజయ్ దేవరకొండ మీద ఓ వీడియోలో తీవ్రంగా కామెంట్లు చేయడం, రౌడీ హీరో స్వయంగా వెళ్లి అతన్ని కలిసి క్లారిటీ ఇచ్చి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సరే ఇదంతా ఎంత చేసినా లైగర్ ఇప్పటికిప్పుడు పికప్ అయ్యే ఛాన్స్ లేదు కానీ దీనికన్నా ముందు లాల్ సింగ్ చడ్డా విషయంలో అమీర్ ఖాన్ ఎదురుకున్న చేదు అనుభవాలు కొన్నేళ్లపాటు మాట్లాడుకునేలా జరిగాయి. ఇక్కడితో అయిపోలేదు. వచ్చే నెల సెప్టెంబర్ 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మీద బాయ్ కాట్ నీలినీడలు కమ్ముతున్నాయి. అలియా భట్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నన్ను చూస్తే చూడండి లేకపోతే లేదు అని బిరుసుగా మాట్లాడ్డం, ప్రెసిడెంట్ అఫ్ ఇండియా ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీటికి తోడు నెపోటిజం ఇష్యూలో టార్గెట్ గా ఉంటూ వస్తున్న రన్బీర్ కపూర్, కరణ్ జోహార్ లు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆ ఆజ్యానికి మరింత నిప్పుని రాజేస్తోంది. అసలే బ్రహ్మాస్త్రకు ఆశించిన స్థాయిలో బజ్ లేదని నిర్మాతలు కిందామీదా పడుతున్నారు. సమర్పకులుగా ఉన్న రాజమౌళి ఏదో తోడ్పాటు అందిస్తున్నారు కానీ అదెంతవరకు పని చేస్తుందో చెప్పలేం. బాహుబలిని మ్యాచ్ చేసే రేంజ్ లో ఇది అంచనాలు పెంచుతుందనుకుంటే ఇలా జరగడం టీమ్ ని కలవరపెడుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా నార్త్ ఇండస్ట్రీ తిరిగి జనవరిలో వచ్చే షారుఖ్ ఖాన్ పఠాన్ దాకా కోలుకోవడం కష్టం. అదే జరిగితే అప్పటిదాకా సౌత్ సినిమాలే ఊపిరినివ్వాలి.
This post was last modified on August 28, 2022 9:09 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…