ఈ మధ్య పాన్ ఇండియా బిల్డప్ తో వచ్చిన సినిమాల్లో అధిక శాతం డిజాస్టర్లు కావడం బాలీవుడ్ ని విపరీతంగా కలవరపెడుతోంది. కంటెంట్ దారుణంగా ఉండటం ఒక కారణమైతే మొదటి వారం రావాల్సిన కనీస వసూళ్లను బాయ్ కాట్ బ్యాచులు మింగేయడం ఎగ్జిబిటర్లను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. మొన్నామధ్య ఓ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఈ అంశం గురించి విజయ్ దేవరకొండ మీద ఓ వీడియోలో తీవ్రంగా కామెంట్లు చేయడం, రౌడీ హీరో స్వయంగా వెళ్లి అతన్ని కలిసి క్లారిటీ ఇచ్చి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సరే ఇదంతా ఎంత చేసినా లైగర్ ఇప్పటికిప్పుడు పికప్ అయ్యే ఛాన్స్ లేదు కానీ దీనికన్నా ముందు లాల్ సింగ్ చడ్డా విషయంలో అమీర్ ఖాన్ ఎదురుకున్న చేదు అనుభవాలు కొన్నేళ్లపాటు మాట్లాడుకునేలా జరిగాయి. ఇక్కడితో అయిపోలేదు. వచ్చే నెల సెప్టెంబర్ 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మీద బాయ్ కాట్ నీలినీడలు కమ్ముతున్నాయి. అలియా భట్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నన్ను చూస్తే చూడండి లేకపోతే లేదు అని బిరుసుగా మాట్లాడ్డం, ప్రెసిడెంట్ అఫ్ ఇండియా ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీటికి తోడు నెపోటిజం ఇష్యూలో టార్గెట్ గా ఉంటూ వస్తున్న రన్బీర్ కపూర్, కరణ్ జోహార్ లు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆ ఆజ్యానికి మరింత నిప్పుని రాజేస్తోంది. అసలే బ్రహ్మాస్త్రకు ఆశించిన స్థాయిలో బజ్ లేదని నిర్మాతలు కిందామీదా పడుతున్నారు. సమర్పకులుగా ఉన్న రాజమౌళి ఏదో తోడ్పాటు అందిస్తున్నారు కానీ అదెంతవరకు పని చేస్తుందో చెప్పలేం. బాహుబలిని మ్యాచ్ చేసే రేంజ్ లో ఇది అంచనాలు పెంచుతుందనుకుంటే ఇలా జరగడం టీమ్ ని కలవరపెడుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా నార్త్ ఇండస్ట్రీ తిరిగి జనవరిలో వచ్చే షారుఖ్ ఖాన్ పఠాన్ దాకా కోలుకోవడం కష్టం. అదే జరిగితే అప్పటిదాకా సౌత్ సినిమాలే ఊపిరినివ్వాలి.
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…