ఇంకో మూడు రోజుల్లో వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న కోబ్రా మీద తెలుగులో పెద్ద అంచనాలేం లేవు. అందుకే హీరో విక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి(హీరోయిన్)తో సహా టీమ్ మొత్తం పాల్గొనగా హైదరాబాద్ వేదికగా ప్రత్యేకంగా మీడియా మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విక్రమ్ చాలా చలాకీగా తెలుగులో మాట్లాడుతూ సినిమా మీద గట్టి నమ్మకమే వ్యక్తం చేశాడు. అపరిచితుడు టైంలో వచ్చిన మార్కెట్ తర్వాత తగ్గిపోయిందనే వాస్తవాన్ని ఒప్పుకుంటూనే కోబ్రాతో అది తిరిగి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
రకరకాల గెటప్పులతో అచ్చం దశావతారంలో కమల్ హాసన్ తరహాలో చాలా మేకప్పులు ట్రై చేసిన విక్రమ్ ఇవన్నీ కథలో భాగమే అంటున్నాడు. ఒక లెక్కల టీచర్ కోబ్రా అనే మారుపేరుతో చేసే సంచలనాత్మకమైన పనులే ఇందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుకు యాక్షన్ థ్రిల్లర్స్ ని డీల్ చేయడంలో మంచి పనితనం ఉంది. డెబ్యూ మూవీ డెమోంటీ కాలనీ తెలుగులోనూ బాగానే ఆడింది. రెండోది నయనతార అంజలి సిబిఐ. కమర్షియల్ గా పే చేయకపోయినా ఓటిటిలో వచ్చాక ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడీ కోబ్రా మూడోది. అసలే మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా. డబ్బింగ్ మూవీని అంత లెంత్ తో మన ఆడియన్స్ చూస్తారా అంటే చాలా బలమైన ఎంగేజింగ్ కంటెంట్ ఉంటే తప్ప చెప్పలేం. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం మ్యూజిక్ లవర్స్ లో పూర్తి స్థాయిలో రిజిస్టర్ అవ్వలేదు. శ్రీనిధి ఉందన్న అంశం కూడా హైలైట్ కాలేకపోయింది. 2005లో వచ్చిన అపరిచితుడు తర్వాత తెలుగులో విక్రమ్ కు ఆ స్థాయిలో చెప్పుకునే పెద్ద హిట్టు పడలేదు. మహా అయితే యావరేజ్ లున్నాయి అంతే. పోటీ లేని మంచి టైం చూసుకుని వస్తున్న కోబ్రా ఆ అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2022 9:01 pm
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…