అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజధానిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే చూస్తామని.. దీనికి బదులుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అమరావతినే రాజధానిగా ఉంచాలని .. హైకోర్టు ఆదేశించిన దరిమిలా.. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలా అనే అంశంపై సర్కారు తేల్చుకోలేక పోతోంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
దీనికి సంబందించి ఇప్పటికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని సర్కారు సుప్రీంలో సవాల్ చేయలేదు. కొందరు పిటిషనర్ల తరఫున పడిన పిటిషన్లకు అనుబంధంగానే ప్రభుత్వం కోర్టులోఈ వాదన వినిపించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబట్టి.. ఎస్ఎల్పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాలనేది ప్రభుత్వానికి మింగుడు పడని విషయంగా మారిపోయింది.
మరోవైపు.. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. మూడు రాజధానుల విషయం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. విశాఖలో రేపు దసరా నాటికి సీఎం పాలన ప్రారంభిస్తారని.. తాడేపల్లి వర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాదని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఇబ్బందులు తప్పవని.. కాబట్టి.. విశాఖకు ఇప్పుడు వెల్లడం కంటే.. ఎన్నికల సమయంలో మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెటర్ అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on August 27, 2022 2:04 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…