అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజధానిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే చూస్తామని.. దీనికి బదులుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అమరావతినే రాజధానిగా ఉంచాలని .. హైకోర్టు ఆదేశించిన దరిమిలా.. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలా అనే అంశంపై సర్కారు తేల్చుకోలేక పోతోంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
దీనికి సంబందించి ఇప్పటికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని సర్కారు సుప్రీంలో సవాల్ చేయలేదు. కొందరు పిటిషనర్ల తరఫున పడిన పిటిషన్లకు అనుబంధంగానే ప్రభుత్వం కోర్టులోఈ వాదన వినిపించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబట్టి.. ఎస్ఎల్పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాలనేది ప్రభుత్వానికి మింగుడు పడని విషయంగా మారిపోయింది.
మరోవైపు.. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. మూడు రాజధానుల విషయం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. విశాఖలో రేపు దసరా నాటికి సీఎం పాలన ప్రారంభిస్తారని.. తాడేపల్లి వర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాదని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఇబ్బందులు తప్పవని.. కాబట్టి.. విశాఖకు ఇప్పుడు వెల్లడం కంటే.. ఎన్నికల సమయంలో మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెటర్ అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on August 27, 2022 2:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…