Movie News

మూడు రాజ‌ధానుల‌పై వైసీపీలో స‌రికొత్త టెన్ష‌న్‌..!

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అనుస‌రించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజ‌ధానిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ.. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా మాత్ర‌మే చూస్తామ‌ని.. దీనికి బ‌దులుగా మ‌రో రెండు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని.. జ‌గ‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని .. హైకోర్టు ఆదేశించిన ద‌రిమిలా.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఏర్పడింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలా అనే అంశంపై స‌ర్కారు తేల్చుకోలేక పోతోంది.  రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయి.

దీనికి సంబందించి ఇప్ప‌టికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని స‌ర్కారు సుప్రీంలో స‌వాల్ చేయ‌లేదు. కొంద‌రు పిటిషనర్ల తరఫున ప‌డిన పిటిష‌న్ల‌కు అనుబంధంగానే ప్ర‌భుత్వం కోర్టులోఈ వాద‌న వినిపించింది. ఆర్టికల్‌ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబ‌ట్టి.. ఎస్‌ఎల్‌పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాల‌నేది ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌ని విష‌యంగా మారిపోయింది.  

మ‌రోవైపు.. ఈ వివాదం ఇలా కొన‌సాగుతుంటే.. మూడు రాజ‌ధానుల విష‌యం మాత్రం ఎటూ తేల‌కుండా పోయింది. విశాఖ‌లో రేపు ద‌స‌రా నాటికి సీఎం పాల‌న ప్రారంభిస్తార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాద‌ని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్క‌ర‌ణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వ‌స్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. కాబ‌ట్టి.. విశాఖ‌కు ఇప్పుడు వెల్ల‌డం కంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో మూడు రాజ‌ధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెట‌ర్ అనేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

This post was last modified on August 27, 2022 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

26 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

39 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago