అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజధానిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే చూస్తామని.. దీనికి బదులుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అమరావతినే రాజధానిగా ఉంచాలని .. హైకోర్టు ఆదేశించిన దరిమిలా.. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలా అనే అంశంపై సర్కారు తేల్చుకోలేక పోతోంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
దీనికి సంబందించి ఇప్పటికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని సర్కారు సుప్రీంలో సవాల్ చేయలేదు. కొందరు పిటిషనర్ల తరఫున పడిన పిటిషన్లకు అనుబంధంగానే ప్రభుత్వం కోర్టులోఈ వాదన వినిపించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబట్టి.. ఎస్ఎల్పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాలనేది ప్రభుత్వానికి మింగుడు పడని విషయంగా మారిపోయింది.
మరోవైపు.. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. మూడు రాజధానుల విషయం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. విశాఖలో రేపు దసరా నాటికి సీఎం పాలన ప్రారంభిస్తారని.. తాడేపల్లి వర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాదని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఇబ్బందులు తప్పవని.. కాబట్టి.. విశాఖకు ఇప్పుడు వెల్లడం కంటే.. ఎన్నికల సమయంలో మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెటర్ అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…