Movie News

మూడు రాజ‌ధానుల‌పై వైసీపీలో స‌రికొత్త టెన్ష‌న్‌..!

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అనుస‌రించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజ‌ధానిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ.. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా మాత్ర‌మే చూస్తామ‌ని.. దీనికి బ‌దులుగా మ‌రో రెండు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని.. జ‌గ‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని .. హైకోర్టు ఆదేశించిన ద‌రిమిలా.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఏర్పడింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలా అనే అంశంపై స‌ర్కారు తేల్చుకోలేక పోతోంది.  రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయి.

దీనికి సంబందించి ఇప్ప‌టికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని స‌ర్కారు సుప్రీంలో స‌వాల్ చేయ‌లేదు. కొంద‌రు పిటిషనర్ల తరఫున ప‌డిన పిటిష‌న్ల‌కు అనుబంధంగానే ప్ర‌భుత్వం కోర్టులోఈ వాద‌న వినిపించింది. ఆర్టికల్‌ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబ‌ట్టి.. ఎస్‌ఎల్‌పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాల‌నేది ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌ని విష‌యంగా మారిపోయింది.  

మ‌రోవైపు.. ఈ వివాదం ఇలా కొన‌సాగుతుంటే.. మూడు రాజ‌ధానుల విష‌యం మాత్రం ఎటూ తేల‌కుండా పోయింది. విశాఖ‌లో రేపు ద‌స‌రా నాటికి సీఎం పాల‌న ప్రారంభిస్తార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాద‌ని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్క‌ర‌ణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వ‌స్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. కాబ‌ట్టి.. విశాఖ‌కు ఇప్పుడు వెల్ల‌డం కంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో మూడు రాజ‌ధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెట‌ర్ అనేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

This post was last modified on August 27, 2022 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

1 hour ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

2 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

3 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago