Movie News

మూడు రాజ‌ధానుల‌పై వైసీపీలో స‌రికొత్త టెన్ష‌న్‌..!

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అనుస‌రించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజ‌ధానిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ.. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా మాత్ర‌మే చూస్తామ‌ని.. దీనికి బ‌దులుగా మ‌రో రెండు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తామ‌ని.. జ‌గ‌న్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని .. హైకోర్టు ఆదేశించిన ద‌రిమిలా.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఏర్పడింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలా అనే అంశంపై స‌ర్కారు తేల్చుకోలేక పోతోంది.  రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయి.

దీనికి సంబందించి ఇప్ప‌టికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని స‌ర్కారు సుప్రీంలో స‌వాల్ చేయ‌లేదు. కొంద‌రు పిటిషనర్ల తరఫున ప‌డిన పిటిష‌న్ల‌కు అనుబంధంగానే ప్ర‌భుత్వం కోర్టులోఈ వాద‌న వినిపించింది. ఆర్టికల్‌ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబ‌ట్టి.. ఎస్‌ఎల్‌పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాల‌నేది ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డ‌ని విష‌యంగా మారిపోయింది.  

మ‌రోవైపు.. ఈ వివాదం ఇలా కొన‌సాగుతుంటే.. మూడు రాజ‌ధానుల విష‌యం మాత్రం ఎటూ తేల‌కుండా పోయింది. విశాఖ‌లో రేపు ద‌స‌రా నాటికి సీఎం పాల‌న ప్రారంభిస్తార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాద‌ని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్క‌ర‌ణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వ‌స్తే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. కాబ‌ట్టి.. విశాఖ‌కు ఇప్పుడు వెల్ల‌డం కంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో మూడు రాజ‌ధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెట‌ర్ అనేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

This post was last modified on August 27, 2022 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

3 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

3 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

4 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

4 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

5 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

5 hours ago