ఏదో రెండు మూడు సినిమాలతో ఆగిపోతుందనుకున్న పాత సినిమాల రీ రిలీజుల ట్రెండ్ ఇకపై క్రమం తప్పకుండ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీటిని హీరోల పుట్టినరోజులకు పరిమితం చేశారు కానీ రాబోయే కాలంలో బ్లాక్ బస్టర్ల యానివర్సరీలకు సైతం స్పెషల్ ప్రీమియర్లు వేసేలా ఉన్నారు. ఆ మధ్య మహేష్ బాబు బర్త్ డేకు ఒక్కడు వేస్తే హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. పోకిరికి ఏకంగా కోటి డెబ్భై లక్షలకు పైగా గ్రాస్ వచ్చింది. ముప్పై ఏళ్ళ వయసున్న ఘరానా మొగుడుకి సైతం చాలా చోట్ల మంచి వసూళ్లు దక్కాయి.
ఇప్పుడు సెప్టెంబర్ 2 జనసేనాని పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. ఆల్రెడీ జల్సాని రీ మాస్టర్ చేసి స్పెషల్ షోల కోసం సిద్ధం చేసి ఉంచారు. ముందు రెండో తేదీ అన్నారు కానీ ఇప్పుడది ఒకటికే వచ్చింది. టీవీలో యూట్యూబ్ లో అన్నేసి సార్లు చూసినా కూడా 4K రెజోల్యూషన్ లో ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తమ్ముడుని కూడా తెస్తున్నారు. ఆగస్ట్ 31 వినాయక చవితి పండగ సందర్భంగా పవర్ స్టార్ అడ్వాన్స్ విషెస్ అంటూ ఆల్రెడీ పోస్టర్లు గట్రా పంచుతున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో బుకింగ్ కూడా మొదలైపోయింది.
ఇలా ఒకే హీరోవి రెండు సూపర్ హిట్లు క్లాష్ చేయడం విచిత్రంగా ఉంది. నోస్టాల్జియా ఫీలింగ్ కోసం ప్రేక్షకులు బాగానే వెళ్తున్నారు కానీ ఇంత తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలకు వసూలు చేసే టికెట్ రేట్లతోనే వీటిని ప్రదర్శించడం సగటు మధ్య తరగతి అభిమానులను ఇబ్బంది పెడుతోంది. 1999లో విడుదలైన తమ్ముడు అప్పట్లో అదిరిపోయే హిట్టు కొట్టింది. అమీర్ ఖాన్ జో జీతా వహి సికందర్ ఫ్రీమేక్ గా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో రమణ గోగుల పాటలు, పవన్ కామెడీ ఓ రేంజ్ లో పేలాయి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వానికి మంచి పేరు వచ్చింది. చూస్తుంటే ఆ రెండు రోజులు పవన్ ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండేలా కనిపించడం లేదు.
This post was last modified on August 27, 2022 5:59 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…