ఎక్కడ చూసినా లైగర్ చర్చలతోనే గత ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. రకరకాల మీమ్స్, సోషల్ మీడియా పోస్టులతో చూసినవాళ్లతో పాటు చూడనివాళ్ళు కూడా టాక్ స్ప్రెడ్ చేయడంలో బిజీ అయిపోయారు. ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ నైచల్తా కానీ ఏరకంగానూ లైగర్ తో పోటీ పడలేమని తెలిసి కూడా ఒక రోజు గ్యాప్ తో కొన్ని చిన్న సినిమాలు ఈ రోజు విడుదలయ్యాయి. కౌంట్ పరంగా నాలుగైదు ఉన్నప్పటికీ వాటిలో కాస్త చెప్పుకోదగ్గ బజ్ ఉన్నది మాత్రం కళాపురంకు ఒక్కటే
ఈ మాత్రం అటెన్షన్ తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడమేనని వేరే చెప్పనక్కర్లేదు. పలాసతో మంచి పేరు తెచ్చుకున్నా శ్రీదేవి సోడా సెంటర్ తో ఫ్లాప్ మూటగట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్ పూర్తి వినోదాత్మకం వైపు వచ్చేసి చేసిన మూవీ కళాపురం. అయితే స్టార్ లెవరూ లేకపోవడంతో కామన్ ఆడియన్స్ కి దీని మీద అంత ఆసక్తి కలగలేదు. ఇక మ్యాటర్ విషయానికి వస్తే కోటి రుపాయలతో పల్లెటూరిలో సినిమా తీయడానికి వచ్చిన ఓ డెబ్యూ డైరెక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. లీడ్ రోల్ సత్యం రాజేష్ ది.
లైన్ వినడానికి బాగానే అనిపించినప్పటికీ హిలేరియస్ కామెడీ ఉంటే తప్ప ఇలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఎంటర్ టైనర్లు జనాన్ని మెప్పించలేవు. అన్ని జాతిరత్నాలు కాలేవు. కరుణ కుమార్ సమస్య రైటింగ్ లోనే వచ్చింది. నటీనటులు తమ వరకు పెర్ఫార్మన్స్ పరంగా లోటు రానివ్వనప్పటికీ సన్నివేశాల్లో బలం లేకపోవడం కళాపురంలో కళను తగ్గించేసింది. క్లైమాక్స్ ని ఏదో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు కానీ అదీ అంతగా అతకని వ్యవహారమే. థియేటర్ లో ఏవి చూడాలి ఓటిటి కోసం ఏవి వెయిట్ చేయాలనే ఫుల్ క్లారిటీతో ఆడియన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సోసో సబ్జెక్టులతో టికెట్ తెగేలా చేయడం కష్టమే.
This post was last modified on August 27, 2022 5:37 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…