Political News

హాట్ టాపిక్: లోకేష్ చెప్తే అయిపోవాలంతే!

మంత్రి లోకేష్ చెప్పిన మాట‌ల‌ను ఎమ్మెల్యేలు తు.చ. త‌ప్ప‌కుండా చేస్తున్నార‌న‌డానికి శ‌నివారం రాష్ట్రంలో జ‌రిగిన కొన్ని ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ‌. వాస్త‌వానికి గ‌తంలోనూ నారా లోకేష్ చెప్పిన అనేక విష‌యాల్లో కొంద‌రు ఎమ్మెల్యేలు ముందుండి ప‌నిచేశారు. తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అన్నం స‌రిగా ఉడ‌క‌క‌పోవ‌డంతోపాటు కొంద‌రి ప‌ళ్లాల్లో పురుగులు కూడా క‌నిపించ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. దీంతో విద్యార్థులు త‌మ ప‌ళ్లాల్లోని అన్నాన్ని డ‌స్టు బిన్‌ల‌లో వేసేశారు.

ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా క‌ల‌త చెందిన మంత్రి లోకేష్‌.. పాఠ‌శాల‌ల్లో అందిస్తున్న మ‌ధ్యాహ్న భోజ‌నం నాణ్య‌త‌ను మ‌రింత మెరుగు ప‌ర‌చాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు ఖ‌చ్చితంగా నియోజ‌క‌వ‌ర్గాల్లోని పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి.. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని రుచి చూడాల‌ని కూడా ఆదేశించారు. దీంతో శ‌నివారం హుటాహుటిన రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు త‌మ త‌మ ప‌రిధిలోని పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని రుచి చూశారు. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా చోట్ల ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది.

నెల్లూరులో కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డి ప‌లు చోట్ల పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి.. మ‌ధ్యాహ్న భోజ‌నం రుచి చూశారు. కొన్ని మార్పులు సూచించారు. అదేవిధంగా ఆత్మ‌కూరులో మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి భోజ‌నం టేస్టు చేశారు. అలాగే ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా ప‌లు పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి భోజనం రుచి చూశారు. మార్పులు సూచించారు. ఇదిలావుంటే.. మంత్రి నారా లోకేష్ చెప్ప‌గానే ఎమ్మెల్యేలు క‌ద‌ల‌డం.. పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించ‌డం వంటివి పార్టీలో ఆస‌క్తిగా మారింది.

ఇప్పుడే కాదు.. గ‌తంలో ప్ర‌జాద‌ర్బార్ల నిర్వ‌హ‌ణ విష‌యంపై కూడా నారా లోకేష్ ఇచ్చిన పిలుపును అందుకున్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హించారు. స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టికీ.. వాటిని కొన‌సాగిస్తున్నారు. కొంద‌రు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అందిస్తున్న‌వారు కూడా ప‌లువురు ఉన్నారు. మొత్తంగా చంద్ర‌బాబు త‌ర్వాత‌.. నారా లోకేష్ మాట‌కు ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్యం ఇవ్వడం.. ఆయ‌న బాట‌లో న‌డిచేందుకు ఉత్సాహం చూప‌డం వంటివి పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.

This post was last modified on March 15, 2026 3:25 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

2 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

2 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

4 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

5 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

6 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

6 hours ago