ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటి యూత్ కి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లేదా ప్రభాస్ గోపిచంద్ లు గుర్తొస్తారు. కానీ సీనియర్లలో చిరంజీవి నాగార్జున ఎంత సఖ్యంగా ఉంటారో కొత్తగా చెప్పడానికేం లేదు. లాల్ సింగ్ చడ్డాని మెగాస్టార్ ప్రమోట్ చేయడానికి అమీర్ ఖాన్ మొదటి కారణమైతే అందులో చైతు ఉన్నాడనేది మరో రీజన్. సరే దాని ఫలితం దారుణంగా రావడం పక్కనపెడితే పలు సందర్భాల్లో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఎంత ఘాడంగా ఉందో బయట పడుతూనే ఉంటుంది. ఆ బాండింగ్ కారణంగానే ఈ ఇద్దరూ ఎప్పుడు క్లాష్ అవ్వరు.
కానీ దసరా పండగను పురస్కరించుకుని ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ లు ఒకేసారి అక్టోబర్ 5కి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత సెలవుల సీజనైనా ఈ పోటీ అంత సేఫ్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. ఒక పక్క మెగా మూవీ మలయాళం రీమేక్. అంచనాలు భయాలు సమాన స్థాయిలో ఉన్నాయి. టీజర్ బాగానే ఉందనిపించినా విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల కామెంట్లు ట్రోలింగ్ తప్పలేదు. ఇక వైల్డ్ డాగ్ డిజాస్టర్ తర్వాత నాగ్ మరోసారి ఇంగ్లీష్ టైటిల్ తో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నాడు. సో హైప్ తగినంత లేదు.
ఒకరు ముందో వెనకో వస్తే బాగుండేది కానీ సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ ఉండటం వల్ల అలా చేయలేని పరిస్థితి నెలకొంది. పోనీ వదులుకుందామా అంటే డిసెంబర్ దాకా డేట్ దొరకదు. సో ముఖాముఖీ తప్పదు. గతంలో ఈ ఇద్దరూ ఒకే రోజు తలపడిన దాఖలాలు అంతగా లేవు. కాకపోతే ఈసారి విచిత్రంగా ఇద్దరూ ఇంగ్లీష్ పేర్లతో ఢీ కొట్టుకోవడం విశేషం. లూసిఫర్ చూసినవాళ్లకు సబ్జెక్టు పరంగా గాడ్ ఫాదర్ మీద ఎగ్జైట్మెంట్ అంతగా లేదు. కానీ ది ఘోస్ట్ పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్టు. మరి ఇద్దరు మిత్రుల్లో ఎవరు గెలుస్తారో లేక ఇటీవల బింబిసార, సీతారామంలు ఒకేరోజు వచ్చి విన్ అయినట్టు జాయింట్ గా నిలుస్తారో చూడాలి
This post was last modified on August 25, 2022 3:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…