ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటి యూత్ కి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లేదా ప్రభాస్ గోపిచంద్ లు గుర్తొస్తారు. కానీ సీనియర్లలో చిరంజీవి నాగార్జున ఎంత సఖ్యంగా ఉంటారో కొత్తగా చెప్పడానికేం లేదు. లాల్ సింగ్ చడ్డాని మెగాస్టార్ ప్రమోట్ చేయడానికి అమీర్ ఖాన్ మొదటి కారణమైతే అందులో చైతు ఉన్నాడనేది మరో రీజన్. సరే దాని ఫలితం దారుణంగా రావడం పక్కనపెడితే పలు సందర్భాల్లో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఎంత ఘాడంగా ఉందో బయట పడుతూనే ఉంటుంది. ఆ బాండింగ్ కారణంగానే ఈ ఇద్దరూ ఎప్పుడు క్లాష్ అవ్వరు.
కానీ దసరా పండగను పురస్కరించుకుని ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ లు ఒకేసారి అక్టోబర్ 5కి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత సెలవుల సీజనైనా ఈ పోటీ అంత సేఫ్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. ఒక పక్క మెగా మూవీ మలయాళం రీమేక్. అంచనాలు భయాలు సమాన స్థాయిలో ఉన్నాయి. టీజర్ బాగానే ఉందనిపించినా విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల కామెంట్లు ట్రోలింగ్ తప్పలేదు. ఇక వైల్డ్ డాగ్ డిజాస్టర్ తర్వాత నాగ్ మరోసారి ఇంగ్లీష్ టైటిల్ తో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నాడు. సో హైప్ తగినంత లేదు.
ఒకరు ముందో వెనకో వస్తే బాగుండేది కానీ సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ ఉండటం వల్ల అలా చేయలేని పరిస్థితి నెలకొంది. పోనీ వదులుకుందామా అంటే డిసెంబర్ దాకా డేట్ దొరకదు. సో ముఖాముఖీ తప్పదు. గతంలో ఈ ఇద్దరూ ఒకే రోజు తలపడిన దాఖలాలు అంతగా లేవు. కాకపోతే ఈసారి విచిత్రంగా ఇద్దరూ ఇంగ్లీష్ పేర్లతో ఢీ కొట్టుకోవడం విశేషం. లూసిఫర్ చూసినవాళ్లకు సబ్జెక్టు పరంగా గాడ్ ఫాదర్ మీద ఎగ్జైట్మెంట్ అంతగా లేదు. కానీ ది ఘోస్ట్ పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్టు. మరి ఇద్దరు మిత్రుల్లో ఎవరు గెలుస్తారో లేక ఇటీవల బింబిసార, సీతారామంలు ఒకేరోజు వచ్చి విన్ అయినట్టు జాయింట్ గా నిలుస్తారో చూడాలి
This post was last modified on August 25, 2022 3:54 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…