పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే హీరోకు అవకాశం సులువుగానే రావచ్చు కానీ.. ఆ తర్వాత మనుగడ అంతా తన ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. సరిగా నటించకపోతే, దాని వల్ల సినిమా చెడిపోతే కెరీర్ ముందుకు సాగడం కష్టం. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. తొలి సినిమా ‘ఉప్పెన’తో నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ అయి తన కెరీర్కు మాంచి ఊపే ఇచ్చింది. ఐతే ఈ సినిమా షూటింగ్లో కొన్ని తాను చాలా ఇబ్బంది పడడమే కాక.. యూనిట్ను ఇబ్బంది పెట్టినట్లు ఆలీ నిర్వహించే టాక్ షోకు అతిథిగా హాజరైన వైష్ణవ్ వెల్లడించాడు.
ఆ చిత్రంలో ‘నీకో మాట చెప్పాలి బేబమ్మా’ అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పాల్సిన సీన్లో తాను తడబడ్డట్లు వైష్ణవ్ వెల్లడించాడు. ఆ సన్నివేశానికి 20కి పైగా టేక్లు తీసుకున్నట్లు అతను తెలిపాడు. ఆ సీన్లో తాను కొంచెం ఎమోషనల్గా మాట్లాడాలని.. కానీ డైలాగ్ చెబుతున్నపుడు ఎందుకో తనకు మాటలు రాలేదని.. ఎమోషన్స్ పండించలేకపోయానని వైష్ణవ్ తెలిపాడు.
20 పైగా టేక్స్ అయ్యాయని.. అందరూ ఆ సీన్ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తున్నారని.. అందరి సమయం, డబ్బు వృథా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు వచ్చేశాయని వైష్ణవ్ తెలిపాడు. అలాగే ఈ సినిమాలో ‘జలజలపాత నువ్వు’ రొమాంటిక్ సాంగ్ చేయడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని.. అంతమంది ముందు ఎలా రొమాన్స్ చేయాలో అర్థం కాలేదని అతను తెలిపాడు.
ఇక తాను బాలనటుడిగా చేసిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో తన పాత్రకు డైలాగ్స్ ఉండవని, తాను చాలా సీరియస్గా కనిపించాలని.. ఐతే ఒక సీన్లో తాను నవ్వేయడంతో పెదమావయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని వైష్ణవ్ వెల్లడించాడు. ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ చేసిన ‘కొండపొలం’ నిరాశపరచగా.. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజవుతుంది.
This post was last modified on August 25, 2022 11:45 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…