తెలుగు ప్రేక్షకులందు యుఎస్ ఎన్నారై తెలుగు ఫ్యాన్స్ కొంచెం భిన్నం. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడ మాస్ మసాలా సినిమాలకు ఆదరణ ఉండదు. వాళ్లు ఎక్కువగా క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, థ్రిల్లర్లను ఎక్కువ ఆదరిస్తారు. కొన్నిసార్లు మాస్ మసాలా సినిమాలను అస్సలు పట్టించుకోరు. ఆ టైపు సినిమాలకు ప్రిమియర్స్ పరంగా కూడా అంత సందడి కనిపించదు.
కానీ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ మూవీ లైగర్కు మాత్రం యుఎస్లో రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాను టాప్ స్టార్ల రేంజిలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్కి బేసిగ్గా యుఎస్లో మంచి ఫాలోయింగే ఉంది. పెళ్ళిచూపులుతో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో అతను అక్కడ సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిందక్కడ.
పూరితో విజయ్ కాంబినేషన్ జనాల్లో బాగానే క్యూరియాసిటీ పెంచుతోంది. దీనికి తోడు అమెరికా బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేయడం ప్లస్ అయింది. దీంతో యుఎస్లో సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అందుకు తగ్గట్లే జోరుమీదున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రానికే ప్రి సేల్స్ ద్వారా 2.75 లక్షల డాలర్లు రాబట్టడం విశేషం.
లైగర్ లాంటి మాస్ మూవీకి ఈ సేల్స్ అసాధారణం. దీన్ని బట్టి చూస్తే ప్రిమియర్స్తో కలిపి తొలి రోజునే ఈ చిత్రం హాఫ్ మిలియన్ క్లబ్బులో చేరడం గ్యారెంటీగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లోపే మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకుంటుంది. ఫుల్ రన్లో 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి కూడా చేరే అవకాశముంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను రూ.9 కోట్లకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమీ కాదనే అనిపిస్తోంది.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…