తెలుగు ప్రేక్షకులందు యుఎస్ ఎన్నారై తెలుగు ఫ్యాన్స్ కొంచెం భిన్నం. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడ మాస్ మసాలా సినిమాలకు ఆదరణ ఉండదు. వాళ్లు ఎక్కువగా క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, థ్రిల్లర్లను ఎక్కువ ఆదరిస్తారు. కొన్నిసార్లు మాస్ మసాలా సినిమాలను అస్సలు పట్టించుకోరు. ఆ టైపు సినిమాలకు ప్రిమియర్స్ పరంగా కూడా అంత సందడి కనిపించదు.
కానీ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ రూపొందించిన మాస్ మూవీ లైగర్కు మాత్రం యుఎస్లో రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాను టాప్ స్టార్ల రేంజిలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్కి బేసిగ్గా యుఎస్లో మంచి ఫాలోయింగే ఉంది. పెళ్ళిచూపులుతో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో అతను అక్కడ సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చిందక్కడ.
పూరితో విజయ్ కాంబినేషన్ జనాల్లో బాగానే క్యూరియాసిటీ పెంచుతోంది. దీనికి తోడు అమెరికా బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేయడం ప్లస్ అయింది. దీంతో యుఎస్లో సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అందుకు తగ్గట్లే జోరుమీదున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రానికే ప్రి సేల్స్ ద్వారా 2.75 లక్షల డాలర్లు రాబట్టడం విశేషం.
లైగర్ లాంటి మాస్ మూవీకి ఈ సేల్స్ అసాధారణం. దీన్ని బట్టి చూస్తే ప్రిమియర్స్తో కలిపి తొలి రోజునే ఈ చిత్రం హాఫ్ మిలియన్ క్లబ్బులో చేరడం గ్యారెంటీగా కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లోపే మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకుంటుంది. ఫుల్ రన్లో 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి కూడా చేరే అవకాశముంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను రూ.9 కోట్లకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టమేమీ కాదనే అనిపిస్తోంది.
This post was last modified on August 25, 2022 12:43 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…