టాలీవుడ్ లో సినిమాలకు పెద్ద సీజన్స్ అంటే అందులో ఒకటి సంక్రాంతి రెండు దసరా మూడు సమ్మర్. ఈ సీజన్స్ లో స్కూల్స్, కాలేజీలు , ఆఫీస్ లకు పండగ సెలవలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా ఈ సీజన్ లో గట్టి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ సీజన్స్ పై ముందు నుండే ఖర్చీఫులు వేస్తుంటారు.
ఈసారి ఈ మూడు సీజన్స్ మీద మెగా స్టార్ కర్చీఫ్ పడింది. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును బేసిక్ గా చిరు లాంటి స్టార్ హీరోకి సీజన్స్ తో పని ఉండదు. సినిమా రిలీజ్ అయితేనే పండగలా భావించే స్టార్ చిరు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే రీ ఎంట్రీ ఇచ్చిన ‘ ఖైదీ నంబర్ 150’ సినిమా తప్ప మిగతా సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ తీసుకురాలేకపోయాయి.
పైగా ‘ఆచార్య’ కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. చాలా ఏరియాల్లో ఆ సినిమా చిరు ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. అందుకే ఈసారి మూవీ లవర్స్ థియేటర్స్ కి విపరీతంగా వచ్చే మూడు సీజన్స్ లో తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు చిరు. నిజానికి ఇది చిరు డిసీషణ్ మాత్రమే కాకపోవచ్చు కానీ మెగా స్టార్ తో నిర్మాతలు కచ్చితంగా మాట్లాడతారు కదా.. ఆ డిస్కషన్ లో చిరు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తన నిర్ణయం ఇదీ అని చెప్పి ఉండొచ్చు.
రెండు బిగ్ ఫెస్టివల్స్ , సమ్మర్ లో అయితే తన సినిమాలకు ఓపెనింగ్స్ డోకా ఉండదని భావించి ఉండొచ్చు. అలాగే సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా డీసెంట్ కలెక్షన్స్ పక్కా.. కాబట్టే ఈ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. మెగా స్టార్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ తో , సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) గా , సమ్మర్ లో ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…