టాలీవుడ్ లో సినిమాలకు పెద్ద సీజన్స్ అంటే అందులో ఒకటి సంక్రాంతి రెండు దసరా మూడు సమ్మర్. ఈ సీజన్స్ లో స్కూల్స్, కాలేజీలు , ఆఫీస్ లకు పండగ సెలవలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా ఈ సీజన్ లో గట్టి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ సీజన్స్ పై ముందు నుండే ఖర్చీఫులు వేస్తుంటారు.
ఈసారి ఈ మూడు సీజన్స్ మీద మెగా స్టార్ కర్చీఫ్ పడింది. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును బేసిక్ గా చిరు లాంటి స్టార్ హీరోకి సీజన్స్ తో పని ఉండదు. సినిమా రిలీజ్ అయితేనే పండగలా భావించే స్టార్ చిరు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే రీ ఎంట్రీ ఇచ్చిన ‘ ఖైదీ నంబర్ 150’ సినిమా తప్ప మిగతా సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ తీసుకురాలేకపోయాయి.
పైగా ‘ఆచార్య’ కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. చాలా ఏరియాల్లో ఆ సినిమా చిరు ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. అందుకే ఈసారి మూవీ లవర్స్ థియేటర్స్ కి విపరీతంగా వచ్చే మూడు సీజన్స్ లో తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు చిరు. నిజానికి ఇది చిరు డిసీషణ్ మాత్రమే కాకపోవచ్చు కానీ మెగా స్టార్ తో నిర్మాతలు కచ్చితంగా మాట్లాడతారు కదా.. ఆ డిస్కషన్ లో చిరు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తన నిర్ణయం ఇదీ అని చెప్పి ఉండొచ్చు.
రెండు బిగ్ ఫెస్టివల్స్ , సమ్మర్ లో అయితే తన సినిమాలకు ఓపెనింగ్స్ డోకా ఉండదని భావించి ఉండొచ్చు. అలాగే సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా డీసెంట్ కలెక్షన్స్ పక్కా.. కాబట్టే ఈ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. మెగా స్టార్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ తో , సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) గా , సమ్మర్ లో ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
This post was last modified on August 24, 2022 11:54 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…