టాలీవుడ్ లో సినిమాలకు పెద్ద సీజన్స్ అంటే అందులో ఒకటి సంక్రాంతి రెండు దసరా మూడు సమ్మర్. ఈ సీజన్స్ లో స్కూల్స్, కాలేజీలు , ఆఫీస్ లకు పండగ సెలవలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా ఈ సీజన్ లో గట్టి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ సీజన్స్ పై ముందు నుండే ఖర్చీఫులు వేస్తుంటారు.
ఈసారి ఈ మూడు సీజన్స్ మీద మెగా స్టార్ కర్చీఫ్ పడింది. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును బేసిక్ గా చిరు లాంటి స్టార్ హీరోకి సీజన్స్ తో పని ఉండదు. సినిమా రిలీజ్ అయితేనే పండగలా భావించే స్టార్ చిరు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే రీ ఎంట్రీ ఇచ్చిన ‘ ఖైదీ నంబర్ 150’ సినిమా తప్ప మిగతా సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ తీసుకురాలేకపోయాయి.
పైగా ‘ఆచార్య’ కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. చాలా ఏరియాల్లో ఆ సినిమా చిరు ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. అందుకే ఈసారి మూవీ లవర్స్ థియేటర్స్ కి విపరీతంగా వచ్చే మూడు సీజన్స్ లో తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు చిరు. నిజానికి ఇది చిరు డిసీషణ్ మాత్రమే కాకపోవచ్చు కానీ మెగా స్టార్ తో నిర్మాతలు కచ్చితంగా మాట్లాడతారు కదా.. ఆ డిస్కషన్ లో చిరు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తన నిర్ణయం ఇదీ అని చెప్పి ఉండొచ్చు.
రెండు బిగ్ ఫెస్టివల్స్ , సమ్మర్ లో అయితే తన సినిమాలకు ఓపెనింగ్స్ డోకా ఉండదని భావించి ఉండొచ్చు. అలాగే సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా డీసెంట్ కలెక్షన్స్ పక్కా.. కాబట్టే ఈ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. మెగా స్టార్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ తో , సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) గా , సమ్మర్ లో ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
This post was last modified on August 24, 2022 11:54 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…