లైగర్.. ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు, మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ దృష్టంతా ఈ చిత్రం మీదే ఉంది. సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న ‘లైగర్’ మీద పెద్ద బడ్జెట్టే పెట్టారు. సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. అంటే ఆ మేర షేర్ వస్తేనే సినిమా హిట్ అన్నట్లు.
ఒక ఏరియాల వారీగా ‘లైగర్’ బిజినెస్ వివరాల విషయానికి వస్తే.. నైజాం ఏరియా హక్కులను రూ.22 కోట్లకు అమ్మారు. వైజాగ్ రేటు రూ.6 కోట్లు పలికింది. సీడెడ్లో ‘లైగర్’ బిజినెస్ రూ.9 కోట్లకు చేరడం విశేషం. ఇక ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నింటికీ కలిపి రూ.18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ బిజినెస్ రూ.55 కోట్లు. కర్ణాటక హక్కులు రూ.5 కోట్లకు, తమిళనాడు రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్ముడవగా.. కేరళలో రూ.1.5 కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసింది. హిందీ హక్కులను రూ.12 కోట్లకు అమ్మారు.
ఇలా మొత్తం ఇండియా వైడ్ బిజినెస్ రూ.రూ.76 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లు పలికాయి. పబ్లిసిటీ ఖర్చు కూడా కలిపితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు అయింది. సినిమా మీద మంచి అంచనాలుండడంతో పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం కష్టమేమీ కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరగడంతో తొలి రోజే ఈ చిత్రం రూ.25 కోట్ల మేర షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే తొలి వీకెండ్ అయ్యేసరికే సినిమా బయ్యర్ల పెట్టుబడిలో 75 శాతానికి పైగా రికవరీ చేసే అవకాశముంది. గురువారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతుండగా.. బుధవారం యుఎస్లో ప్రిమియర్స్ పడుతున్నాయి.
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…