ఇప్పుడు భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. మన దర్శకులు తమిళంలో సినిమాలు చేస్తున్నారు. తమిళ హీరోలు తెలుగులోకి అడుగు పెడుతున్నారు. అలాగే మన హీరోలు, దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా సినిమా ముఖచిత్రం పూర్తిగా మారుతో వస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్లు విజయ్, ధనుష్ తెలుగులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వీరి కంటే ముందు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించిన సూర్య మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీ చేసే విషయంలో ఇదిగో అదిగో అంటున్నాడే తప్ప అడుగులు ముందుకు పడడం లేదు. ఐతే పూర్తి తెలుగు సినిమా అని చెప్పలేం కానీ.. చాలామంది స్టార్ల తరహాలో అథెంటిక్ బైలింగ్వల్ ఫిలిం చేయడానికి సూర్య రెడీ అయ్యాడు. అతను కథానాయకుడిగా ‘శౌర్యం’ శివ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.
సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండడం విశేషం. యువి వాళ్లు ప్రభాస్తో పాన్ ఇండియా సినిమాలు తీశారు కానీ.. నేరుగా తమిళంలో అడుగు పెట్టబోతుండడం ఇదే తొలిసారి. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో ‘శౌర్యం’ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం సూపర్ హిట్టయింది. తర్వాత శంఖం, దరువు సినిమాలు తీయగా అవి నిరాశ పరిచాయి.
ఆ తర్వాత అతను తమిళంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆపై అజిత్తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్బస్టర్లు తీశాడు. చివరగా రజినీతో శివ చేసిన ‘అన్నాత్తె’ నిరాశ పరిచింది. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు సూర్యతో తన మార్కు మాస్ ఎంటర్టైనర్ తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు.
This post was last modified on August 24, 2022 8:55 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…