ఇప్పుడు భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. మన దర్శకులు తమిళంలో సినిమాలు చేస్తున్నారు. తమిళ హీరోలు తెలుగులోకి అడుగు పెడుతున్నారు. అలాగే మన హీరోలు, దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా సినిమా ముఖచిత్రం పూర్తిగా మారుతో వస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్లు విజయ్, ధనుష్ తెలుగులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
వీరి కంటే ముందు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించిన సూర్య మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీ చేసే విషయంలో ఇదిగో అదిగో అంటున్నాడే తప్ప అడుగులు ముందుకు పడడం లేదు. ఐతే పూర్తి తెలుగు సినిమా అని చెప్పలేం కానీ.. చాలామంది స్టార్ల తరహాలో అథెంటిక్ బైలింగ్వల్ ఫిలిం చేయడానికి సూర్య రెడీ అయ్యాడు. అతను కథానాయకుడిగా ‘శౌర్యం’ శివ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.
సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండడం విశేషం. యువి వాళ్లు ప్రభాస్తో పాన్ ఇండియా సినిమాలు తీశారు కానీ.. నేరుగా తమిళంలో అడుగు పెట్టబోతుండడం ఇదే తొలిసారి. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో ‘శౌర్యం’ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం సూపర్ హిట్టయింది. తర్వాత శంఖం, దరువు సినిమాలు తీయగా అవి నిరాశ పరిచాయి.
ఆ తర్వాత అతను తమిళంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆపై అజిత్తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్బస్టర్లు తీశాడు. చివరగా రజినీతో శివ చేసిన ‘అన్నాత్తె’ నిరాశ పరిచింది. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు సూర్యతో తన మార్కు మాస్ ఎంటర్టైనర్ తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు.
This post was last modified on August 24, 2022 8:55 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…