ఒక సేతు.. ఒక సామి.. ఒక పితామగన్.. ఒక అన్నియన్.. మామూలు హిట్లా ఇవి. ఈ భారీ విజయాలతో అప్పట్లో విక్రమ్ పేరు మార్మోగిపోయింది తమిళనాట. ఇందులో పితామగన్ను శివపుత్రుడుగా, అన్నియన్ను అపరిచితుడుగా తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా అవి బ్లాక్బస్టర్లు అయ్యాయి. తెలుగులోనూ విక్రమ్కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో వరుసబెట్టి అతడి సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ ‘అన్నియన్’ తర్వాత గత 17 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.
ఐ సహా కొన్ని చిత్రాలు తమిళంలో అయినా బాగా ఆడాయి కానీ.. తెలుగులో మాత్రం ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్కు నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేదు. ఇంతకుముందు విక్రమ్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూసేవారు కానీ.. ఈ మధ్య పట్టించుకోవడమే మానేశారు. దీంతో అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదలే కాలేదు కూడా. ఇలాంటి టైంలో ‘కోబ్రా’ చిత్రంతో తెలుగులోకి తిరిగి అడుగు పెడుతున్నాడు విక్రమ్.
తమిళంలో డిమాంటి కాలనీ, ఇమైక నోడిగల్ (తెలుగులో అంజలి ఐపీఎస్) లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రమిది. ఈ నెల 31న వినాయక చవితి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతోంది. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.
కాకపోతే విక్రమ్ ఎప్పట్నుంచో చేస్తున్నదే ఈ సినిమాలోనూ చేసినట్లుగా కనిపిస్తోంది. జీనియస్ అయిన లెక్కల మాస్టారు వేర్వేరు వేషాలు వేసుకుని క్రైమ్స్ చేసే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్లో విక్రమ్ రకరకాల వేషాలు చూసి అతడికి ఇంకా ఈ పిచ్చి వదల్లేదా అన్న ఫీలింగ్ కలిగింది. కమల్ హాసన్ ఎప్పుడో ఇలాంటివి చేసేశాడు.
తర్వాత విక్రమ్ కూడా మల్లన్నసహా కొన్ని చిత్రాల్లో ఇలాంటివి ట్రై చేశాడు. ఇక మళ్లీ అతను కొత్తగా ఏం చూపిస్తాడో అర్థం కావడం లేదు. ట్రైలర్ అయితే అనుకున్నంత ఆసక్తికరంగా లేడు. పవన్ ఫుల్ విలన్ అవసరమైన ఇలాంటి సినిమాకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ను ఎందుకు తీసుకున్నారో అంతుబట్టడం లేదు. ఇలాంటి కంటెంట్తో అయితే విక్రమ్ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ‘కోబ్రా’ తెలుగులో అనుకున్నంత ఇంపాక్ట్ అయితే వేసేలా, విక్రమ్ కోరుకున్న విజయాన్ని అందించేలా కనిపించడం లేదు.
This post was last modified on August 24, 2022 3:57 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…