ఒక సేతు.. ఒక సామి.. ఒక పితామగన్.. ఒక అన్నియన్.. మామూలు హిట్లా ఇవి. ఈ భారీ విజయాలతో అప్పట్లో విక్రమ్ పేరు మార్మోగిపోయింది తమిళనాట. ఇందులో పితామగన్ను శివపుత్రుడుగా, అన్నియన్ను అపరిచితుడుగా తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా అవి బ్లాక్బస్టర్లు అయ్యాయి. తెలుగులోనూ విక్రమ్కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో వరుసబెట్టి అతడి సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ ‘అన్నియన్’ తర్వాత గత 17 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.
ఐ సహా కొన్ని చిత్రాలు తమిళంలో అయినా బాగా ఆడాయి కానీ.. తెలుగులో మాత్రం ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్కు నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేదు. ఇంతకుముందు విక్రమ్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూసేవారు కానీ.. ఈ మధ్య పట్టించుకోవడమే మానేశారు. దీంతో అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదలే కాలేదు కూడా. ఇలాంటి టైంలో ‘కోబ్రా’ చిత్రంతో తెలుగులోకి తిరిగి అడుగు పెడుతున్నాడు విక్రమ్.
తమిళంలో డిమాంటి కాలనీ, ఇమైక నోడిగల్ (తెలుగులో అంజలి ఐపీఎస్) లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రమిది. ఈ నెల 31న వినాయక చవితి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతోంది. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.
కాకపోతే విక్రమ్ ఎప్పట్నుంచో చేస్తున్నదే ఈ సినిమాలోనూ చేసినట్లుగా కనిపిస్తోంది. జీనియస్ అయిన లెక్కల మాస్టారు వేర్వేరు వేషాలు వేసుకుని క్రైమ్స్ చేసే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్లో విక్రమ్ రకరకాల వేషాలు చూసి అతడికి ఇంకా ఈ పిచ్చి వదల్లేదా అన్న ఫీలింగ్ కలిగింది. కమల్ హాసన్ ఎప్పుడో ఇలాంటివి చేసేశాడు.
తర్వాత విక్రమ్ కూడా మల్లన్నసహా కొన్ని చిత్రాల్లో ఇలాంటివి ట్రై చేశాడు. ఇక మళ్లీ అతను కొత్తగా ఏం చూపిస్తాడో అర్థం కావడం లేదు. ట్రైలర్ అయితే అనుకున్నంత ఆసక్తికరంగా లేడు. పవన్ ఫుల్ విలన్ అవసరమైన ఇలాంటి సినిమాకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ను ఎందుకు తీసుకున్నారో అంతుబట్టడం లేదు. ఇలాంటి కంటెంట్తో అయితే విక్రమ్ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ‘కోబ్రా’ తెలుగులో అనుకున్నంత ఇంపాక్ట్ అయితే వేసేలా, విక్రమ్ కోరుకున్న విజయాన్ని అందించేలా కనిపించడం లేదు.
This post was last modified on August 24, 2022 3:57 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…