రామ్ గోపాల్ వర్మ ఏ టాపిక్ గురించి మాట్లాడినా రొటీన్కు కొంచెం భిన్నంగానే ఉంటుంది. దాన్ని కొత్తదనంగా చూస్తారు కొందరు. తిక్కలా భావిస్తారు ఇంకొందరు. కొన్నేళ్ల నుంచి చేతలు తగ్గించేసి మాటలకే పరిమితం కావడంతో ఆయన విలువ కోల్పోయిన మాట వాస్తవం. ఇక ట్విట్టర్లో ఆయన అదే పనిగా ఎవరినో ఒకరిని కెలుకుతూ తన స్థాయికి తగని కామెంట్లు చేస్తూ తన విలువను మరింత తగ్గించేసుకున్న సంగతి తెలిసందే. అయినా సరే.. అప్పుడప్పుడు వర్మ కామెంట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి.
జనాల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఒక ఫిలిం మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని థియేటర్లో చూస్తన్నపుడు తనకు సర్కస్ లాగా అనిపించిందని రాము వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, సర్కస్ చూస్తున్నపుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో ఆ ఇనిమా చూస్తున్నపుడూ అలాగే అనిపించిందని వర్మ అన్నాడు. ముఖ్యంగా బ్రిడ్జి దగ్గర రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి పిల్లాడిని కాపాడే సన్నివేశం జెమిని సర్కస్ చూస్తున్న భావన కలిగించిందని వర్మ పేర్కొన్నాడు.
ఇక తన పాత మిత్రుడు.. దొంగా దొంగా, గాయం చిత్రాలకు కలిసి పని చేసిన మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాలు ఏవీ తనకు నచ్చవని వర్మ కామెంట్ చేశాడు. అలాగే మణిరత్నంకు కూడా తన చిత్రాలు నచ్చవని అన్నాడు. తామిద్దరం కలిసి దొంగా దొంగా, గాయం సినిమాల కోసం స్క్రిప్టు చర్చల్లో పాల్గొన్నపుడు ఒకరి మాట ఒకరు అస్సలు వినలేదని.. కానీ ఆ రెండు చిత్రాల్లోనూ టైటిల్స్లో తమ పేర్లు మాత్రం వేసుకున్నామని వర్మ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఒక సబ్జెక్ట్ ఎంచుకుని దానికి సరిపోయే నటీనటులను ఎంచుకున్న సినిమాలంటే క్షణక్షణం, సర్కార్ మాత్రమే అని. ఈ సందర్భంగా వర్మ వెల్లడించాడు.
This post was last modified on August 23, 2022 10:42 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…