టాలీవుడ్లో సీక్వెల్స్ అంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉండేది మొన్నటిదాకా. సూపర్ హిట్, బ్లాక్బస్టర్ చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు చేసినపుడల్లా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. గాయం, శంకర్ దాదా, చంద్రముఖి, మంత్ర, కిక్, ఆర్య, వెన్నెల, గబ్బర్ సింగ్, మన్మథుడు.. ఈ సినిమాలన్నింటికీ సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ మధ్య ‘ఎఫ్-2’ సినిమాకు కూడా కొనసాగింపుగా ఫ్రాంఛైజీ ఫిలిం చస్తే అది కూడా వర్కవుట్ కాలేదు.
ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందటి ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ రెడీ అయ్యేసరికి అందరూ దాని వైపు అనుమానంగా చూశారు. నెగెటివ్ సెంటిమెంట్ ఈ సినిమాను కూడా కాటేస్తుందేమో అన్న ఆందోళన కనిపించింది. కానీ ఈ ఆందోళనను పటాపంచలు చేస్తూ ‘కార్తికేయ-2’ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ చిన్న సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా రూ.30-40 కోట్ల మధ్య వసూళ్లు వస్తే గొప్ప అనుకున్నారు.
కానీ ఈ చిత్రం ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, అలాగే యుఎస్లో దుమ్ముదులుపుతూనే.. నార్త్ ఇండియాలో అసాధారణ వసూళ్లు సాధిస్తోంది. హిందీలో 50 షోలతో మొదలై 3 వేలకు పైగా షోలతో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు. అక్కడి జనాలకు సినిమా బాగా ఎక్కేస్తోంది. హిందూ ప్రో సినిమాలకు అక్కడి బ్రహ్మరథం పడుతున్న పడుతున్న సమయంలో రిలీజ్ కావడం ‘కార్తికేయ-2’కు బాగా కలిసొస్తోంది.
మొత్తంగా సినిమా భారీ విజయాన్నందుకోవడంతో ‘కార్తికేయ’ను చాలా పెద్ద ఫ్రాంఛైజీగా మార్చుకోవడానికి అవకాశం దక్కింది. నిఖిల్-చందూ మొండేటిల ప్రయాణం ఇంతటితో ఆగేది కాదు. కార్తికేయ పాత్రను పట్టుకుని కనీసం ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఆస్కారముంది. ఆ క్యారెక్టర్, థీమ్ మాత్రమే కొనసాగిస్తూ ఎన్ని కొత్త కథలైనా చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చింది ‘కార్తికేయ-2’. కాబట్టి తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీగా ‘కార్తికేయ’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
This post was last modified on August 23, 2022 3:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…