తనను మాస్ లో బలంగా నిలబెడుతుందని అక్కినేని అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ ఆ మధ్య టీజర్ రిలీజ్ తో హడావిడి చేశాక ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది. దానికి రెస్పాన్స్ బాగానే వచ్చినప్పటికి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అంతా సవ్యంగా అనుకున్న టైం ప్రకారం జరిగి ఉంటే ఆగస్ట్ 12న థియేటర్లలో ఏజెంట్ రచ్చ జరిగిపోయేది. కానీ సాధ్యపడలేదు. సరే క్వాలీటీ ముఖ్యమని ఫ్యాన్స్ సర్దుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మౌనం వహిస్తే ఎలానేదే వాళ్ళ ప్రశ్న.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏజెంట్ ని డిసెంబర్ మూడో వారానికి రెడీ చేస్తున్నారు. అలా అని అదెంతో దూరంలో లేదు. జస్ట్ మూడున్నర నెలలు అంతే. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ రిలీజ్, ఈవెంట్లు వగైరా చాలా తతంగాలుంటాయి. మరి దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలంటే స్పీడ్ పెంచాలి. కొన్ని సన్నివేశాలు మరింత బెటర్ గా రావడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత రీ షూట్ అడిగాడని, నాగార్జున అఖిల్ తో పాటు అనిల్ సుంకర వాటి పట్ల సంతృప్తిగా ఉండటంతో డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి.
ఇదంతా వీలైనంత త్వరగా కొలిక్కి రావాలి. ఎందుకంటే ఏజెంట్ ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాదు. పదుల కోట్ల బడ్జెట్ తో ముడిపడిన ప్యాన్ ఇండియా మూవీ. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో ప్రమోషన్లు ప్లాన్ చేసుకోవాలి. మమ్ముట్టి ఉన్నాడు కాబట్టి మలయాళంలోనూ క్రేజ్ వస్తుంది. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ ని ఆడియన్స్ మైండ్ లో బలంగా రిజిస్టర్ చేయాలి. ఒకవేళ డిసెంబర్ స్లాట్ మిస్ అయితే సంక్రాంతి బరిలో తన స్థాయిలో మించిన వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఎందుకనుకుంటే ప్లానింగ్ మార్చుకోవడం అవసరం.
This post was last modified on August 22, 2022 6:32 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…