ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో మొదలుపెట్టి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరు అదేదో తమ ఇంటి కుటుంబ సభ్యుడి బర్త్ డే అన్నంత ఆనందంగా ఫీలవుతూ విషెస్ చెబుతున్నారు. కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్లతో మొదలుపెట్టి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల దాకా అందరూ మెగా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. టీవీలో పాత సినిమాలు, థియేటర్లో ఘరానా మొగుడు హంగామా ఓ రేంజ్ లో జరిగిపోతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు పూరి జగన్నాధ్ ఆసక్తికరమైన పాన్ కథ ఒకటి పంచుకున్నారు. సుమారు పదిహేనేళ్లకు పైగా వెనక్కు వెళ్తే ఓసారి చిరంజీవి సరదాగా పూరిని కారులో ఎక్కించుకుని అలా బయటికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఊరికే సరదాగా అన్నారు తప్ప కారణం చెప్పలేదు. అప్పటికి మాదాపూర్ పరిసరాలు ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. ఫారం మాల్ నిర్మాణం కూడా జరగలేదు. అలా వెళ్తుండగా ఒక చోట నిర్మానుషమైన ప్రాంతంలో ఓ చిన్న పాన్ డబ్బా కనిపిస్తే మెగాస్టార్ నేరుగా దాని ముందుకెళ్లి ఆపారు. దుకాణంలో కిళ్ళీలు కట్టే వ్యక్తి తప్ప ఇంకెవరు లేరు. చిరు నేరుగా అతన్ని పిలిచి పాన్ కట్టమని పురమాయించారు.
ఒక్కసారిగా అతగాడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చిరంజీవి తన బడ్డీ కొట్టుకు రావడం ఏమిటని షాక్ లో ఉంటూనే లోపలికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఒకపక్క పాన్ తయారు చేస్తూనే ఎవరికైనా ఈ విషయం చెప్పాలనే ఉద్వేగంలో మెగాస్టార్ మెగాస్టార్ అని పదే పదే అరుస్తున్నాడు. కానీ అక్కడ ఎవరైనా ఉంటేగా వినిపించుకోవడానికి. అలా మెగా చేతుల మీదుగా డబ్బులు పుచ్చుకోవడం, కారు తిరిగి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అతని ఎగ్జైట్ మెంట్ అలా మనసులో ముద్రించుకుపోయిందని పూరి వివరించాడు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబోలు పాపం సెల్ఫీ మిస్ అయ్యింది. ఒకవేళ ఆ పాన్ వాలా ఎవరికైనా చెప్పినా నమ్మరు సరికదా ఎగతాళి కూడా చేసుంటారు.
This post was last modified on August 22, 2022 5:25 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…