ఇప్పుడు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే పుష్ప-2నే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ముఖ్యంగా హిందీలో ఆ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అనూహ్య విజయం సాధించింది. దీంతో పుష్ప-2 మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఐతే చాలా రోజుల ముందే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అంచనాల ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోవడంతో సుకుమార్ అంత తేలిగ్గా స్క్రిప్టును లాక్ చేయలేదు. ముందు అనుకున్న కథను మార్చి.. నెలల తరబడి డిస్కషన్లు జరిపి చివరికి స్క్రిప్టు ఒక కొలిక్కి తెచ్చారు. ఎట్టకేలకు ఈ సోమవారం ‘పుష్ప-2’ పూజ నిర్వహించబోతున్నారు. అలా అని వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుందా అంటే అదేమీ కాదు.
హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను పూజా కార్యక్రమంలోనూ పాల్గొనట్లేదు. చాలా సింపుల్గా ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తున్నారు. తర్వాత సరైన ముహూర్తం లేకపోవడంతో ఇప్పుడీ తంతు పూర్తి కానుంది. ‘పుష్ప-2’ షూటింగ్ సెప్టెంబరు ద్వితీయార్ధంలో మొదలవుతుందని సమాచారం. బన్నీ ఇండియాకు తిరిగి వచ్చాక తిరిగి పుష్పరాజ్గా మారడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. ఇంకాస్త జుట్టు, గడ్డం పెంచాల్సి ఉంది. తర్వాత ఒకసారి లుక్ టెస్ట్ చేయించుకుని షూటింగ్కు హాజరవుతాడు.
ఈ లోపు మిగతా ఆర్టిస్టుల డేట్లు అవీ సర్దుబాటు చేసుకుని, షెడ్యూళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతుంది సుక్కు టీం. ‘పుష్ప-1’ విషయంలో బాగా హడావుడి అయిన నేపథ్యంలో ఈసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అన్నీ కూడా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలని సుకుమార్ అండ్ టీం ఫిక్సయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే ఏడాది జూన్కు పూర్తి కావచ్చని అంచనా. ఆ తర్వాత మూడు నెలలు గ్యాప్ పెట్టుకుని దసరా టైంకి సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయట.
This post was last modified on August 22, 2022 12:36 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…