కంగనా రనౌత్ రూటే వేరు. ఆమె ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం అని అందరికీ తెలుసు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేయడం ఆమెకు అలవాటే. ధకడ్ సినిమా అల్ట్రా డిజాస్టర్ అయ్యాక కంగనా కొంచెం సైలెంట్ అయింది. కొంత కాలంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన న్యూస్తో ఆమె వార్తల్లోకి వచ్చింది. తనకు అవార్డు ఇస్తానన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధం కావడం విశేషం.
చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేటు అవార్డులను కంగనా బహిష్కరిస్తోంది. అందులో ఫిలిం ఫేర్ కూడా ఉంది. గతంలో ఆమెకు అవార్డులు ఆఫర్ చేసినా తిరస్కరించింది. ఐతే ఈసారి ఫిలిం ఫేర్ వాళ్లు తలైవి చిత్రానికి గాను కంగనాకు ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వాలనుకున్నారట. ఇందుకోసం ఆమెకు కాల్ చేశారట. ఐతే ఆమె తిరస్కరించింది.
అయినా సరే.. ఆపకుండా తనను కాల్ చేసి విసిగిస్తున్నారంటూ ఫిలిం ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా. తాను 2014 నుంచి అవార్డులను బహిష్కరిస్తున్నానని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతి మయం, అనైతికం అని.. కానీ ఇప్పుడు తలైవి చిత్రానికి తనకు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నారని ఇన్స్టాగ్రామ్ పోస్టులు పేర్కొంది కంగనా.
తాను నో అన్నప్పటికీ తన పేరును నామినేట్ చేయడం పట్ల తాను షాకయ్యానని.. ఇలాంటి అవినీతి అవార్డులు అందుకోవడానికి తన విలువలు, నిబద్ధత ఒప్పుకోవని.. అందుకే ఫిలిం ఫేర్ వాళ్ల మీద దావా వేయాలని నిర్ణయించుకున్నానని కంగనా ఈ పోస్టులో వెల్లడించింది. కంగనా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవార్డు ఇస్తానంటే దావా వేయడమేంటి.. కంగనా తిక్కకు లెక్కే లేదు అంటూ ఆమె మీద కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on August 22, 2022 10:27 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…