ఒకప్పుడు అభిమానుల డిమాండ్లు హీరోలకు నిర్మాతలకు తెలియాలంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. అవి కూడా వాళ్ళ అసిస్టెంట్లు చదివి ముఖ్యమైనవి మాత్రమే సదరు స్వీకరణకర్తలకు అందేలా చేసేవారు. తర్వాత కొంత కాలం ఈమెయిల్స్ నడిచాయి కానీ వాటికీ ఇదే సమస్య. కానీ ఇప్పుడలా కాదు. ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా ఒక టాపిక్ ట్రెండ్ చేశారంటే అది నేరుగా సదరు వ్యక్తికి చేరిపోతోంది. తాజాగా నిర్మాత దిల్ రాజుకి తన నిర్మాణంలో ఉన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ విషయంలో ఈ సెగ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు హైదరాబాద్ హైటెక్స్ లో కార్నివల్ పేరిట భారీ వేడుకలు నిర్వహించారు. అతిథులు చాలానే వచ్చారు. అందులో దిల్ రాజు ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15 అప్డేట్ ఇవ్వమని తనను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారని అది చెన్నై నుంచి తన టీమ్ చెప్పారని, అదే మాట దర్శకుడికి చేరవేసి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇచ్చేయమని శంకర్ ని అడగటం అన్నీ జరిగిపోయాయట. తనను ఆడుకున్నారని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
ఏ రూపంలో అయితేనేం మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్ లో సాగుతోందన్న మాట. నిజానికి చరణ్ ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించడం. రెండోది దీన్ని ఆపేసి శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి చేయడానికి వెళ్లిపోయారని ప్రచారం జరగడం. వీటిని కొట్టిపారేయలేదు కానీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందనే మాటైతే రాజు గారు అనలేదు. సో తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాట వాస్తవమే అనుకోవాలి.
This post was last modified on August 22, 2022 10:23 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…