ఒకప్పుడు అభిమానుల డిమాండ్లు హీరోలకు నిర్మాతలకు తెలియాలంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. అవి కూడా వాళ్ళ అసిస్టెంట్లు చదివి ముఖ్యమైనవి మాత్రమే సదరు స్వీకరణకర్తలకు అందేలా చేసేవారు. తర్వాత కొంత కాలం ఈమెయిల్స్ నడిచాయి కానీ వాటికీ ఇదే సమస్య. కానీ ఇప్పుడలా కాదు. ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా ఒక టాపిక్ ట్రెండ్ చేశారంటే అది నేరుగా సదరు వ్యక్తికి చేరిపోతోంది. తాజాగా నిర్మాత దిల్ రాజుకి తన నిర్మాణంలో ఉన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ విషయంలో ఈ సెగ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు హైదరాబాద్ హైటెక్స్ లో కార్నివల్ పేరిట భారీ వేడుకలు నిర్వహించారు. అతిథులు చాలానే వచ్చారు. అందులో దిల్ రాజు ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15 అప్డేట్ ఇవ్వమని తనను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారని అది చెన్నై నుంచి తన టీమ్ చెప్పారని, అదే మాట దర్శకుడికి చేరవేసి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇచ్చేయమని శంకర్ ని అడగటం అన్నీ జరిగిపోయాయట. తనను ఆడుకున్నారని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
ఏ రూపంలో అయితేనేం మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్ లో సాగుతోందన్న మాట. నిజానికి చరణ్ ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించడం. రెండోది దీన్ని ఆపేసి శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి చేయడానికి వెళ్లిపోయారని ప్రచారం జరగడం. వీటిని కొట్టిపారేయలేదు కానీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందనే మాటైతే రాజు గారు అనలేదు. సో తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాట వాస్తవమే అనుకోవాలి.
This post was last modified on August 22, 2022 10:23 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…