ఒకప్పుడు అభిమానుల డిమాండ్లు హీరోలకు నిర్మాతలకు తెలియాలంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. అవి కూడా వాళ్ళ అసిస్టెంట్లు చదివి ముఖ్యమైనవి మాత్రమే సదరు స్వీకరణకర్తలకు అందేలా చేసేవారు. తర్వాత కొంత కాలం ఈమెయిల్స్ నడిచాయి కానీ వాటికీ ఇదే సమస్య. కానీ ఇప్పుడలా కాదు. ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా ఒక టాపిక్ ట్రెండ్ చేశారంటే అది నేరుగా సదరు వ్యక్తికి చేరిపోతోంది. తాజాగా నిర్మాత దిల్ రాజుకి తన నిర్మాణంలో ఉన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ విషయంలో ఈ సెగ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు హైదరాబాద్ హైటెక్స్ లో కార్నివల్ పేరిట భారీ వేడుకలు నిర్వహించారు. అతిథులు చాలానే వచ్చారు. అందులో దిల్ రాజు ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15 అప్డేట్ ఇవ్వమని తనను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారని అది చెన్నై నుంచి తన టీమ్ చెప్పారని, అదే మాట దర్శకుడికి చేరవేసి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇచ్చేయమని శంకర్ ని అడగటం అన్నీ జరిగిపోయాయట. తనను ఆడుకున్నారని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
ఏ రూపంలో అయితేనేం మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్ లో సాగుతోందన్న మాట. నిజానికి చరణ్ ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించడం. రెండోది దీన్ని ఆపేసి శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి చేయడానికి వెళ్లిపోయారని ప్రచారం జరగడం. వీటిని కొట్టిపారేయలేదు కానీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందనే మాటైతే రాజు గారు అనలేదు. సో తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాట వాస్తవమే అనుకోవాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…