ఒకప్పుడు అభిమానుల డిమాండ్లు హీరోలకు నిర్మాతలకు తెలియాలంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. అవి కూడా వాళ్ళ అసిస్టెంట్లు చదివి ముఖ్యమైనవి మాత్రమే సదరు స్వీకరణకర్తలకు అందేలా చేసేవారు. తర్వాత కొంత కాలం ఈమెయిల్స్ నడిచాయి కానీ వాటికీ ఇదే సమస్య. కానీ ఇప్పుడలా కాదు. ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా ఒక టాపిక్ ట్రెండ్ చేశారంటే అది నేరుగా సదరు వ్యక్తికి చేరిపోతోంది. తాజాగా నిర్మాత దిల్ రాజుకి తన నిర్మాణంలో ఉన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ విషయంలో ఈ సెగ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు హైదరాబాద్ హైటెక్స్ లో కార్నివల్ పేరిట భారీ వేడుకలు నిర్వహించారు. అతిథులు చాలానే వచ్చారు. అందులో దిల్ రాజు ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15 అప్డేట్ ఇవ్వమని తనను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారని అది చెన్నై నుంచి తన టీమ్ చెప్పారని, అదే మాట దర్శకుడికి చేరవేసి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇచ్చేయమని శంకర్ ని అడగటం అన్నీ జరిగిపోయాయట. తనను ఆడుకున్నారని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
ఏ రూపంలో అయితేనేం మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్ లో సాగుతోందన్న మాట. నిజానికి చరణ్ ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించడం. రెండోది దీన్ని ఆపేసి శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి చేయడానికి వెళ్లిపోయారని ప్రచారం జరగడం. వీటిని కొట్టిపారేయలేదు కానీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందనే మాటైతే రాజు గారు అనలేదు. సో తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాట వాస్తవమే అనుకోవాలి.
This post was last modified on August 22, 2022 10:23 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…