కొన్నిసార్లు ఆలస్యం కూడా చాలా మేలు చేస్తుంది. రైలు జీవిత కాలం లేట్ అనే సామెత పాజిటివ్ కోణంలో తీసుకోవచ్చు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది నిఖిల్ 18 పేజెస్. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సుకుమార్ రచనలో కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. నాలుగు నెలల క్రితమే టీజర్ వచ్చింది. గీతా ఆర్ట్స్ టూ లాంటి అగ్ర బ్యానర్ నిర్మాణం, టాప్ టెక్నికల్ టీమ్ వెరసి ఇంత ఆలస్యం ఎందుకనే అనుమానాలు ఫ్యాన్స్ లో లేకపోలేదు. కార్తికేయ 2నే దీనికన్నా లేట్ గా పూర్తయ్యింది. ఇప్పుడదే కలిసొస్తోంది.
కార్తికేయ 2 రిజల్ట్ ప్యాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోవడంతో ఇప్పుడా ఫ్యాక్టర్ 18 పేజెస్ బిజినెస్ కి బ్రహ్మాండంగా పనికొస్తుంది. రెండింటిలోనూ అనుపమ పరమేశ్వరనే హీరోయిన్ కావడం కాకతాళీయంగా జరిగిందే అయినా ఇప్పుడా అంశాన్ని కూడా హై లైట్ చేసుకోవచ్చు. ఎలాగూ తనతో పాటు నిఖిల్ కు నార్త్ ఆడియన్స్ లో గుర్తింపు వచ్చింది కాబట్టి జస్ట్ హిందీ డబ్బింగ్ చేస్తే చాలు హక్కుల రూపంలో మంచి ఆదాయం చేతికి అందుతుంది. మార్కెటింగ్ లో ఎలాగూ గీతా ఆర్ట్స్ నైపుణ్యం తెలిసిందే కాబట్టి లాభాలు ఖాయం.
దీనికే కాదు నిఖిల్ తర్వాతి మూవీ స్పైకు సైతం ఇదంతా కలిసొచ్చేదే. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లు దాటుకుని మరీ ఏకంగా అరవై కోట్ల మార్కును దాటేసిన కార్తికేయ 2 తాలూకు సక్సెస్ కిక్ నిఖిల్ మోహంలో మాములుగా కనిపించడం లేదు. 18 పేజెస్ ని వాయిదా వేసుకుంటూ రావడానికి కారణం ఏదైనా అది మంచే చేసింది. ఫాంటసీ జానర్ కానప్పటికీ ఇందులో వైవిధ్యమైన లవ్ కాన్సెప్ట్ తో ఏదో థ్రిల్లర్ టచ్ కూడా ఇచ్చినట్టున్నారు. కార్తికేయ 2 వేడి చల్లారాక వెంటనే ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు ప్లానింగ్ జరుగుతోందట.
This post was last modified on August 21, 2022 8:36 am
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…