వచ్చే నెల 30న విడుదల కాబోతున్న మణిరత్నం విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తెలుగు వెర్షన్ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరు కాగా హైదరాబాద్ వేదికగా చోళ చోళ సాంగ్ ని లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇంత గ్రాండ్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదలు. తమిళంతో పోలిస్తే ఇక్కడ దీని మీద ఆశించిన స్థాయిలో బజ్ లేదు. సెల్వన్ అంటే మనకు సంబంధం లేని వీరుడనే భావన టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉండటంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవసరమే.
ఈ వేడుకలో భాగంగా మణిరత్నం మాట్లాడుతూ తన ప్రసంగంలో చిరంజీవికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. కారణం వివరించలేదు. టైం వచ్చినప్పుడు బయటపెడతానని అన్నారు. ఇందులో ఏదైనా స్పెషల్ క్యామియో చేశారా లేక వాయిస్ ఓవర్ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూశారు. కానీ సాధ్యపడలేదు. అసలు మణిరత్నం తమిళం వదిలేసి తెలుగులో తీసింది ఒకే ఒక్క స్ట్రెయిట్ మూవీ. అది నాగార్జున గీతాంజలి. ఎలాంటి క్లాసిక్ గా నిలిచిపోయిందో అందరికీ తెలుసు.
మరి పొన్నియన్ సెల్వన్ కు సంబంధించి మెగాస్టార్ ప్రమేయం ఏమిటో ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ గొంతు మాత్రమే ఇచ్చి ఉంటే అదేమంత ఎగ్జైటింగ్ న్యూస్ కాదు. ఎందుకంటే చిరు ఇలా పరోక్షంగా భాగం తీసుకున్నవి ఆడిన దాఖలాలు అంతగా లేవు. తెలుగులోనూ పిఎస్ 1 గా చెలామణి చేస్తున్న ఈ గ్రాండియర్ గ్రాండ్ సక్సెస్ కావడం మణిరత్నంకు చాలా అవసరం. కెజిఎఫ్, బాహుబలి రేంజ్ లో హిట్టు కొడితేనే బిజినెస్ పరంగా సీక్వెల్ కు క్రేజ్ వస్తుంది. లేదంటే చాలా ఇబ్బందే. టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మొచ్చనేలాగే ఉంది.
This post was last modified on August 20, 2022 3:51 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…