Movie News

క‌న్నీళ్లు పెట్టుకున్న ఛార్మి

13-14 ఏళ్ల వ‌య‌సులోని క‌థానాయిక‌గా అరంగేట్రం చేసి దాదాపు ద‌శాబ్దంన్న‌ర పాటు టాలీవుడ్లో పేరున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగింది ఛార్మి. ఐతే క‌థానాయిక‌గా కెరీర్ ముగుస్తున్న త‌రుణంలో ఆమెకు పూరి జ‌గ‌న్నాథ్‌తో స్నేహం కుదిరి ఆయ‌న సినిమాల ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చూడ‌డం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే పూరి సినిమాలు చాలా వాటికి ప్రొడ‌క్ష‌న్లో ప‌ని చేసిన ఛార్మి.. ఇప్పుడు లైగ‌ర్ లాంటి భారీ మూవీతో నిర్మాత‌గా త‌న కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్తోంది.

ఈ సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేయ‌డానికి ఛార్మి ఎంత క‌ష్ట‌ప‌డిందో పూరి ఇప్ప‌టికే ప్ర‌మోష‌నల్ ఈవెంట్ల‌లో చెప్పాడు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న నేప‌థ్యంలో పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌ను ఛార్మి ఇంట‌ర్వ్యూలో చేయ‌డం విశేషం. ఈ ఇంట‌ర్వ్యూ చివ‌ర్లో ఛార్మి చాలా ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఈ సినిమా కోసం ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను గుర్తు చేసుకుంటూ ఆమె ఉద్వేగానికి గురైంది. 2019 ఆగ‌స్టులో విజ‌య్‌కి లైగ‌ర్ క‌థ చెప్పామ‌ని, సినిమా ఓకే అయ్యాక క‌రోనా వ‌చ్చింద‌ని, దాంతో పాటే ప‌లుమార్లు లాక్‌డౌన్ కూడా వ‌చ్చింద‌ని.. దీంతో సినిమాకు ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌లేద‌ని ఛార్మి వెల్ల‌డించింది.

ఒక ద‌శ‌లో త‌మ జేబుల్లో ఒక్క రూపాయి లేద‌ని, అలాంటి టైంలో ఓటీటీ నుంచి డైరెక్ట్ డిజిట‌ల్ రిలీజ్ కోసం పెద్ద ఆఫ‌ర్ వచ్చింద‌ని ఛార్మి చెప్పింది. ఆ ఆఫ‌ర్ చూసి వేరే వాళ్ల‌యితే టెంప్ట్ అయ్యేవాళ్ల‌ని, కానీ దాన్ని రిజెక్ట్ చేసే ద‌మ్ము పూరి జ‌గ‌న్నాథ్‌కు మాత్ర‌మే ఉంద‌ని, ఇది థియేట‌ర్ ఫిలిం అన్న ఉద్దేశంతో ఓటీటీ ఆఫ‌ర్ తిర‌స్క‌రించార‌ని ఛార్మి చెప్పింది. ఎంతో దృఢ సంక‌ల్పం ఉన్న పూరి కూడా ఈ సినిమా జ‌ర్నీలో కొన్నిసార్లు నిరాశ‌కు గుర‌య్యాడ‌ని.. కానీ ఆయ‌న్ని ముందుకు న‌డిపించింది విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సినిమాలోని కంటెంట్ మాత్ర‌మే అని చెబుతూ ఛార్మి క‌న్నీళ్లు పెట్టేసుకుంది.

This post was last modified on August 20, 2022 1:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

44 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

1 hour ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

1 hour ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago