‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో సినిమా సెట్ చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. శంకర్ ఒకప్పటంత ఫామ్లో లేకపోయినా సరే.. తెలుగులో తొలిసారిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటించడం పట్ల అభిమానులు గర్వపడుతున్నారు. ఐతే ఈ చిత్ర షూటింగ్కు అప్పుడప్పుడూ బ్రేకులు తప్పట్లేదు.
ఇంతకముందు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోగా.. మధ్యలో ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మౌనిక (రంగస్థలం ఫేమ్) తప్పుకోవడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆగింది. వారి స్థానంలో సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ వచ్చాడు. ఆయన సినిమా కోసం ఒక భారీ యూనివర్శిటీ సెట్ వేశాడు. అందులో కొన్ని రోజులు చిత్రీకరణ జరిగింది. ఇంతలో టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో మళ్లీ బ్రేక్ పడింది.
మరోవైపు శంకర్ మధ్యలో ఆపేసిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు సంబంధించిన షెడ్యూళ్లు ఖరారు చేసే పనిలో ఉన్నారాయన. ‘ఇండియన్-2’తో పాటు సమాంతరంగా చరణ్ సినిమాను కూడా చేయాలని శంకర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంతలో చరణ్ సినిమాకు సంబంధించి మరో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా నుంచి రవీందర్ సైతం తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
రామకృష్ణ-మౌనికలకు శంకర్తో పడకపోగా.. రవీందర్కు నిర్మాత దిల్ రాజుతో ఏదో తేడా కొట్టినట్లు చెబుతున్నారు. ఏ విషయంలో విభేదాలు వచ్చాయన్నది తెలియడం లేదు కానీ.. రవీందర్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవమే అంటున్నారు. శంకర్ మళ్లీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకో ప్రొడక్షన్ డిజైనర్ను చూసుకుని సెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఆర్ట్ డైరెక్టర్లు మారడంలో వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఔట్ పుట్లోనూ తేడా వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 20, 2022 11:46 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…