‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో సినిమా సెట్ చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. శంకర్ ఒకప్పటంత ఫామ్లో లేకపోయినా సరే.. తెలుగులో తొలిసారిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటించడం పట్ల అభిమానులు గర్వపడుతున్నారు. ఐతే ఈ చిత్ర షూటింగ్కు అప్పుడప్పుడూ బ్రేకులు తప్పట్లేదు.
ఇంతకముందు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోగా.. మధ్యలో ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మౌనిక (రంగస్థలం ఫేమ్) తప్పుకోవడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆగింది. వారి స్థానంలో సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ వచ్చాడు. ఆయన సినిమా కోసం ఒక భారీ యూనివర్శిటీ సెట్ వేశాడు. అందులో కొన్ని రోజులు చిత్రీకరణ జరిగింది. ఇంతలో టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో మళ్లీ బ్రేక్ పడింది.
మరోవైపు శంకర్ మధ్యలో ఆపేసిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు సంబంధించిన షెడ్యూళ్లు ఖరారు చేసే పనిలో ఉన్నారాయన. ‘ఇండియన్-2’తో పాటు సమాంతరంగా చరణ్ సినిమాను కూడా చేయాలని శంకర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంతలో చరణ్ సినిమాకు సంబంధించి మరో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా నుంచి రవీందర్ సైతం తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
రామకృష్ణ-మౌనికలకు శంకర్తో పడకపోగా.. రవీందర్కు నిర్మాత దిల్ రాజుతో ఏదో తేడా కొట్టినట్లు చెబుతున్నారు. ఏ విషయంలో విభేదాలు వచ్చాయన్నది తెలియడం లేదు కానీ.. రవీందర్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవమే అంటున్నారు. శంకర్ మళ్లీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకో ప్రొడక్షన్ డిజైనర్ను చూసుకుని సెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఆర్ట్ డైరెక్టర్లు మారడంలో వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఔట్ పుట్లోనూ తేడా వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 20, 2022 11:46 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…