Movie News

చరణ్ సినిమా నుంచి అతను ఔట్?

‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా సెట్ చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. శంకర్ ఒకప్పటంత ఫామ్‌లో లేకపోయినా సరే.. తెలుగులో తొలిసారిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటించడం పట్ల అభిమానులు గర్వపడుతున్నారు. ఐతే ఈ చిత్ర షూటింగ్‌కు అప్పుడప్పుడూ బ్రేకులు తప్పట్లేదు.

ఇంతకముందు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోగా.. మధ్యలో ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మౌనిక (రంగస్థలం ఫేమ్) తప్పుకోవడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆగింది. వారి స్థానంలో సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ వచ్చాడు. ఆయన సినిమా కోసం ఒక భారీ యూనివర్శిటీ సెట్ వేశాడు. అందులో కొన్ని రోజులు చిత్రీకరణ జరిగింది. ఇంతలో టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో మళ్లీ బ్రేక్ పడింది.

మరోవైపు శంకర్ మధ్యలో ఆపేసిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు సంబంధించిన షెడ్యూళ్లు ఖరారు చేసే పనిలో ఉన్నారాయన. ‘ఇండియన్-2’తో పాటు సమాంతరంగా చరణ్ సినిమాను కూడా చేయాలని శంకర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంతలో చరణ్ సినిమాకు సంబంధించి మరో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా నుంచి రవీందర్ సైతం తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

రామకృష్ణ-మౌనికలకు శంకర్‌తో పడకపోగా.. రవీందర్‌కు నిర్మాత దిల్ రాజు‌తో ఏదో తేడా కొట్టినట్లు చెబుతున్నారు. ఏ విషయంలో విభేదాలు వచ్చాయన్నది తెలియడం లేదు కానీ.. రవీందర్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవమే అంటున్నారు. శంకర్ మళ్లీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకో ప్రొడక్షన్ డిజైనర్‌ను చూసుకుని సెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఆర్ట్ డైరెక్టర్లు మారడంలో వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఔట్ పుట్‌లోనూ తేడా వస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on August 20, 2022 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

59 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago