‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో సినిమా సెట్ చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. శంకర్ ఒకప్పటంత ఫామ్లో లేకపోయినా సరే.. తెలుగులో తొలిసారిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటించడం పట్ల అభిమానులు గర్వపడుతున్నారు. ఐతే ఈ చిత్ర షూటింగ్కు అప్పుడప్పుడూ బ్రేకులు తప్పట్లేదు.
ఇంతకముందు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోగా.. మధ్యలో ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మౌనిక (రంగస్థలం ఫేమ్) తప్పుకోవడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆగింది. వారి స్థానంలో సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ వచ్చాడు. ఆయన సినిమా కోసం ఒక భారీ యూనివర్శిటీ సెట్ వేశాడు. అందులో కొన్ని రోజులు చిత్రీకరణ జరిగింది. ఇంతలో టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో మళ్లీ బ్రేక్ పడింది.
మరోవైపు శంకర్ మధ్యలో ఆపేసిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు సంబంధించిన షెడ్యూళ్లు ఖరారు చేసే పనిలో ఉన్నారాయన. ‘ఇండియన్-2’తో పాటు సమాంతరంగా చరణ్ సినిమాను కూడా చేయాలని శంకర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంతలో చరణ్ సినిమాకు సంబంధించి మరో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా నుంచి రవీందర్ సైతం తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
రామకృష్ణ-మౌనికలకు శంకర్తో పడకపోగా.. రవీందర్కు నిర్మాత దిల్ రాజుతో ఏదో తేడా కొట్టినట్లు చెబుతున్నారు. ఏ విషయంలో విభేదాలు వచ్చాయన్నది తెలియడం లేదు కానీ.. రవీందర్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవమే అంటున్నారు. శంకర్ మళ్లీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకో ప్రొడక్షన్ డిజైనర్ను చూసుకుని సెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఆర్ట్ డైరెక్టర్లు మారడంలో వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఔట్ పుట్లోనూ తేడా వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 20, 2022 11:46 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…