ఘజని మొహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర చేశాడో ఖచ్చితంగా చెప్పలేం కానీ డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది మాత్రం హిట్టు కోసం ఏళ్ళ తరబడి పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఓ రెండు మోస్తరు హిట్లు దక్కాయి అంతే. దాని తర్వాత ఒక్కటంటే ఒక్కటి కనీసం యావరేజ్ అయితే ఒట్టు. అయినా కూడా చేతి నిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోల్లో ఒకడిగా ఉంటున్న ఆది సాయికుమార్ ఈ వారం తీస్ మార్ ఖాన్ గా మాస్ అప్పీల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అనాథగా పెరిగిన ఓ కుర్రాడి జీవితంలో తోబుట్టువులా భావించే ఆమె హత్యకు గురవుతుంది. ఎవరు చేశారో కనుక్కునే క్రమంలో హీరో కొన్ని వీరోచిత సాహసాలు చేసి బలవంతులైన శత్రువులను ఎదిరించాల్సి వస్తుంది. చివరికి ఈ కేసుని ఎలా ఛేదించాడు, ఎలా దుర్మార్గుల ఆట కట్టించాడు అనేదే తీస్ మార్ ఖాన్ కథ. ఏ మాత్రం కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాలతో చిరంజీవి రవితేజ అంతటి స్టార్లే బాక్సాఫీస్ వద్ద దెబ్బలు తింటుంటే ఏ ధైర్యంతో ఆది సాయికుమార్ తో ఇలాంటి సాహసాలు చేయిస్తున్నారో సదరు దర్శక నిర్మాతలకే తెలియాలి.
తీస్ మార్ ఖాన్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు. దర్శకుడు కళ్యాణ్ జి ఎంత అవుట్ డేటెడ్ ప్లాట్ తీసుకున్నప్పటికీ దానికి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకున్నా ఎంతో కొంత బెటర్ అవుట్ ఫుట్ దక్కేది. కానీ అలాంటి ప్రయత్నమేమీ జరగకపోవడంతో పాయల్ రాజ్ పుత్ ఒలికించిన గ్లామర్ తప్ప మాస్ కంటూ ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోయింది. ఛాయాగ్రహణం సంగీతం లాంటి సాంకేతిక విభాగాలు సైతం పెద్దగా తోడ్పడలేదు. ఇదే టైటిల్ తో అక్షయ్ కుమార్ 2010లో ఓ హిందీ సినిమా చేశాడు. దాని రిజల్ట్ ఫ్లాప్. ఇప్పుడు ఆ పేరుతో పాటు ఫలితం కూడా రిపీట్ చేశాడు ఆది.
This post was last modified on August 20, 2022 3:16 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…