అసలు ఎలాంటి ప్రమోషన్ చేయకుండా గప్ చుప్ గా విడుదలైన సినిమా తిరు. ధనుష్ హీరో, నిత్య మీనన్ రాశిఖన్నా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమున్న హీరోయిన్లు, అన్నిటిని మించి సన్ పిక్చర్స్ నిర్మాణం. అయినా కూడా టైం తగినంత లేకపోవడంతో హడావిడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయి. నగరాల్లో మినహాయించి బిసి సెంటర్స్ లో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. తమిళనాడులో మాత్రం ఎక్కువ థియేటర్లలో గ్రాండ్ గా చెప్పుకునే రిలీజ్ ఇచ్చారు.
ఇక కంటెంట్ విషయానికి వస్తే ఈ తిరు రొటీన్ డ్రామానే. చదువు సరిగా పూర్తి కాక డెలివరీ బాయ్ గా మారిన ఓ కుర్రాడికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. క్లోజ్ ఫ్రెండ్ అయిన మరో అమ్మాయితో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లోనేమో తండ్రితో మాటలుండవు. తాతయ్యతో మంచి రిలేషన్. ఇలా సాగుతూ ఉండగా లైఫ్ లో రెండు మూడు ట్విస్టులు వచ్చి పడతాయి. వాటిని ఎలా ఎదురుకుని తిరు తన లక్ష్యాన్ని చేరుకున్నాడనేదే స్టోరీ. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ కొత్తగా ఆలోచించలేదు. టైం పాస్ చేయించే టార్గెట్ పెట్టుకున్నాడు.
సింపుల్ ఎమోషన్స్ తో నడిచిన ఈ తిరు ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరుగా పర్లేదనిపించినా రెండో సగంలో తడబాటుతో జస్ట్ యావరేజ్ మెట్టు దగ్గర ఆగిపోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా అద్భుతాలేం చేయలేదు. జస్ట్ పాస్ అనిపించుకుంది. కాకపోతే ధనుష్ తో పాటు భారతీరాజా, నిత్య మీనన్ లాంటి ఆర్టిస్టుల నటన వీక్ గా ఉన్న కంటెంట్ ని కొంతమేర కాపాడుతూ వచ్చింది. అయితే బింబిసార, కార్తికేయ 2, సీతారామం లాంటి రిచ్ గ్రాండియర్స్ చూసిన తెలుగు జనాల కళ్ళకు తిరులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. రఘువరన్ బిటెక్ ఛాయలు ఉండటం ఈ సినిమా ప్రత్యేకతను తగ్గించేసింది. ఏ ఆప్షన్ లేకపోతే తిరుని ట్రై చేయొచ్చనేలా ఉన్నాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…