అసలు ఎలాంటి ప్రమోషన్ చేయకుండా గప్ చుప్ గా విడుదలైన సినిమా తిరు. ధనుష్ హీరో, నిత్య మీనన్ రాశిఖన్నా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమున్న హీరోయిన్లు, అన్నిటిని మించి సన్ పిక్చర్స్ నిర్మాణం. అయినా కూడా టైం తగినంత లేకపోవడంతో హడావిడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయి. నగరాల్లో మినహాయించి బిసి సెంటర్స్ లో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. తమిళనాడులో మాత్రం ఎక్కువ థియేటర్లలో గ్రాండ్ గా చెప్పుకునే రిలీజ్ ఇచ్చారు.
ఇక కంటెంట్ విషయానికి వస్తే ఈ తిరు రొటీన్ డ్రామానే. చదువు సరిగా పూర్తి కాక డెలివరీ బాయ్ గా మారిన ఓ కుర్రాడికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. క్లోజ్ ఫ్రెండ్ అయిన మరో అమ్మాయితో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లోనేమో తండ్రితో మాటలుండవు. తాతయ్యతో మంచి రిలేషన్. ఇలా సాగుతూ ఉండగా లైఫ్ లో రెండు మూడు ట్విస్టులు వచ్చి పడతాయి. వాటిని ఎలా ఎదురుకుని తిరు తన లక్ష్యాన్ని చేరుకున్నాడనేదే స్టోరీ. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ కొత్తగా ఆలోచించలేదు. టైం పాస్ చేయించే టార్గెట్ పెట్టుకున్నాడు.
సింపుల్ ఎమోషన్స్ తో నడిచిన ఈ తిరు ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరుగా పర్లేదనిపించినా రెండో సగంలో తడబాటుతో జస్ట్ యావరేజ్ మెట్టు దగ్గర ఆగిపోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా అద్భుతాలేం చేయలేదు. జస్ట్ పాస్ అనిపించుకుంది. కాకపోతే ధనుష్ తో పాటు భారతీరాజా, నిత్య మీనన్ లాంటి ఆర్టిస్టుల నటన వీక్ గా ఉన్న కంటెంట్ ని కొంతమేర కాపాడుతూ వచ్చింది. అయితే బింబిసార, కార్తికేయ 2, సీతారామం లాంటి రిచ్ గ్రాండియర్స్ చూసిన తెలుగు జనాల కళ్ళకు తిరులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. రఘువరన్ బిటెక్ ఛాయలు ఉండటం ఈ సినిమా ప్రత్యేకతను తగ్గించేసింది. ఏ ఆప్షన్ లేకపోతే తిరుని ట్రై చేయొచ్చనేలా ఉన్నాడు.
This post was last modified on August 18, 2022 7:56 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…