సినిమాల నిర్మాణం, విడుదల విషయంలో జరిగే లావాదేవీల తాలూకు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటారని పేరున్న సురేష్ బాబు ఆ మధ్య ఓటిటి రిలీజుల గురించి తన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పడం ఇంకా గుర్తే. నష్టం రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడనని నారప్ప, దృశ్యం 2 లను డైరెక్ట్ స్ట్రీమింగ్ కు ఇవ్వడం ద్వారా రుజువు చేశారు కూడా. అయితే ఇటీవలి కాలంలో ఓటిటిలు కొత్త సినిమాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహరశైలిలో మార్పులు తేవడంతో ఈయన సైతం తన స్ట్రాటజీని మార్చుకోక తప్పని పరిస్థితి తలెత్తింది.
దానికి ఉదాహరణే తాజాగా వచ్చిన రెండు అనౌన్స్ మెంట్లు. శాకినీ డాకిని సురేష్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే. ఓ కొరియన్ రీమేక్ గా తీసిన ఈ డిఫరెంట్ థ్రిల్లర్ ని ముందు నెట్ ఫ్లిక్స్ కోసమనే అనుకున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ బ్రాండ్ ఇక్కడ పని చేసింది. రెండు మూడు సందర్భాల్లో ఇదే విషయాన్నీ చెప్పారు కూడా. కానీ కొన్ని నెలల గ్యాప్ తీసుకున్నాక సడన్ గా సెప్టెంబర్ 16 థియేటర్లలో తెస్తున్నామని చెప్పేశారు. స్టార్ హీరో లేకుండా కేవలం ఇద్దరు హీరోయిన్లను నమ్ముకుని జనం హాలు దాకా వస్తారా అంటే చూడాలి.
ఇదిలా ఉండగా సింహ కోడూరి నటించిన దొంగలున్నారు జాగ్రత్తలోనూ సురేష్ బ్యానర్ పార్ట్ నర్ షిప్ ఉంది. ఇది కూడా కేవలం వారం గ్యాప్ తో సెప్టెంబర్ 23 డేట్ ఫిక్స్ చేశారు. దీనికీ మార్కెట్ పరంగా పెద్ద క్రేజ్ లేదు. పబ్లిసిటీ మెటీరియల్ ఆసక్తికరంగానే ఉంది కానీ జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది కంటెంట్ ని బట్టి ఉంటుంది. మొత్తానికి ఓటిటికి ఫిట్ అవుతాయనే ఇలాంటి సినిమాలను ఇప్పుడు వెండితెరకు తీసుకురావడం చూస్తుంటే డిజిటిల్ కంపెనీల పోకడ మారినట్టు స్పష్టంగా ఆర్థమవుతోంది. విరాట పర్వం సైతం విపరీతమైన జాప్యానికి నోచుకుని చివరికి థియేటర్లలో వచ్చినా లాభం లేకపోయింది. మరి ఈ రెండైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.
This post was last modified on August 18, 2022 4:32 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…