ఉప్పెనతో అమాంతం కుర్రకారు ఫాలోయింగ్ పెరిగిపోయిన హీరోయిన్ కృతి శెట్టికి కేవలం నెల తిరక్కుండానే రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు గట్టి షాక్ ఇచ్చాయి. రామ్, నితిన్ కెరీర్లలోనే అత్యధిక బడ్జెట్ లతో రూపొందిన ది వారియర్, మాచర్ల నియోజవర్గం రెండూ మరీ దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే అందులో తనవి పెద్దగా ప్రాధాన్యత లేని కేవలం పాటల కోసమే ఉన్నట్టుగా అనిపించే పాత్రలు కావడం మరో మైనస్ అయ్యింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్ల తాలూకు ఆనందం ఇంత త్వరగా ఆవిరవ్వడం ఊహించనిది
ఇప్పుడు తన ఆశలన్నీ “ఆ అమ్మాయికి గురించి మీకు చెప్పాలి” మీదే ఉన్నాయి. ఏఎంబి మాల్ లో లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా తన ఫ్లాపుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు లింగుస్వామి, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని హిట్టు ఫ్లాపు అనే తేడా సినిమా చేయడానికి ముందు తెలియదు కాబట్టి కష్టంలో ఎలాంటి మార్పు ఉండదని తెలివైన సమాధానం చెప్పింది. సెప్టెంబర్ 16 విడుదల కాబోతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో సమ్మోహనం లాగే సినిమా బ్యాక్ డ్రాప్ నే తీసుకున్నారు
శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సుధీర బాబుకి కూడా ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. వ్యక్తిగతంగా తన మార్కెట్ ఇంకా బలపడని తరుణంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణే తనకు మరో బ్రేక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. పైగా ఏదో ప్రయోగం చేద్దామని రివెంజ్ డ్రామా తీసుకుని వితో షాక్ తిన్న ఇంద్రగంటి తిరిగి తన ఓల్డ్ స్కూల్ కు వచ్చేసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తీశారు. కారణాలేమిటో కానీ ఇది కూడా చాలా ఆలస్యంగానే వస్తోంది. ఆ మధ్య కొన్ని నెలలు కనీసం అప్డేట్స్ ఇవ్వకుండా ఆపేశారు. మరి కృతి శెట్టి హ్యాట్రిక్ డేంజర్ నుంచి ఈ అమ్మాయి ఎలా తప్పిస్తుందో వచ్చే నెల చూడాలి.
This post was last modified on August 18, 2022 10:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…